*కార్మికుల సంక్షేమానికి ఐ ఎన్ టి యుసి కృషి చేస్తుంది: లక్ష్మీనారాయణ రెడ్డి
INTUC Support for Workers : ప్రజా దీవేన, కోదాడ: కార్మికులకు అండ ఐ ఎన్ టి యు సి జండా అని టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,ఐ ఎన్ టి యు సి కోదాడ ప్రాంతీయ అధ్యక్షులు మాజీ సర్పంచ్ పార సీతయ్య అన్నారు.గురువారం కోదాడ పట్టణంలో వేలాదిమంది కార్మికులతో ఐఎన్ టీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ని హుజూర్నగర్ రోడ్డులో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన భారీ మహాసభలో పారా సీతయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం పని గంటలు శ్రమకు తగిన వేతనం ఐ ఎన్ టి యు సి కృషితో అమలు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని కార్మికులు ఐక్యంగా ఉండి ఐఎన్ టియు సి నాయకత్వంలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి ల సహకారంతో కోదాడ డివిజన్ లో ఐ ఎన్ టి యు సి అనుబంద కార్మిక యూనియన్లకు కార్యాలయ భవనాలతో పాటు, సంక్షేమ పథకాలన్నీ వర్తింప చేస్తామన్నారు. కాగా పట్టణంలో ఐ ఎన్ టి యు సి జండాలతో వందలాది మంది కార్మికులతో నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతలపాటి శ్రీనివాసరావు, ఈదుల కృష్ణయ్య, వంటి పులి వెంకటేష్, లారీ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రామినేని శ్రీనివాసరావు , పాలూరి సత్యనారాయణ, సైదా నాయక్, యూత్ నాయకులు డేగ శ్రీధర్, నెమ్మాది నవీన్ ,గరిణె శ్రీధర్, షఫీ, బచ్చు అశోక్, పంది తిరపయ్య, కర్రీ సుబ్బారావు, కమదనపు చందర్రావు ,బాజన్ , కంబాల రంగ, వీరభద్రం,ఐఎన్టియూసీ నాయకులు శ్రీను, మిల్లు డ్రైవర్ లు, పెయింటర్లు, బైక్ మెకానిక్ లు , గుమస్తా లు తదితరులు పాల్గొన్నారు.