ఇరాన్,ఇజ్రాయెల్ కాల్పుల విరమణ
–అధికారికంగా ప్రకటించిన ఇరాన్ అధికారిక మీడియా
–ఇరు దేశాల మధ్య ఒప్పందం కుది రిందన్న ట్రంప్ ప్రకటన
Iran- Israel shootout: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: ఇరాన్ ఇ జ్రాయెల్ దేశాల మధ్య కొనసాగు తోన్న బీకర యుద్ధం ముగిసింది.ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడి యాతో పాటు అగ్రరాజ్యం అధినేత ట్రంప్ అధికారికంగా వెల్లడించారు. గడిచిన 12 రోజులుగా కొనసాగు తున్న యుద్ధం ఎట్టకేలకు ముగిసిం దoటూ ఇరాన్ అధికారిక మీడియా చానల్ ప్రకటన చేయగా ఈ ప్రక ట న చేసే చివరి నిమిషం వరకు కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడులను ఆ పకపోవడం గమనార్హం. టెల్అవీవ్ పై టెహ్రాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా ప దిమందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి అనంతరం ఇరాన్ సీజ్ ఫైర్ ప్రకటన చేసింది. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో రెం డు దేశాలు శాంతి అంటూ కాళ్ల బే రానికి వచ్చాయన్నారు. అక్కడ శాంతి అవసరం ఉందని గుర్తించిన ట్టు తెలిపారు. ఈ మేరకు ఇరు దే శాల మధ్య ఒప్పందం కుదిరిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొ న్నారు.
ఒప్పందానికి తానే మధ్య వర్తిత్వం వహించినట్టు చెప్పుకున్నారు. కా ల్పుల విరమణ ఒప్పందంలో పశ్చి మాసియాతో పాటు ప్రపంచం కూ డా నిజమైన విజయం సాధించింద ని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలు భవిష్యత్లో ప్రేమ, శాంతిని చూస్తా యన్నారు. అయితే ట్రంప్ ప్రక ట నను ఇరాన్ విదేశాంగ మంత్రి ఒక దశలో తోసి పుచ్చినా ఆ తర్వాత కొద్దిసేపటికి కాల్పుల విరమణను ఆ దేశం కూడా ప్రకటించింది.
*విరుద్ధ ప్రకటనలతో గందరగో ళం..*
కాగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కా ల్పుల విరమణ ఒప్పందం రెండు దే శాల ప్రకటనలు గందరగోళానికి గు రి చేశాయి. సీజ్ ఫైర్పై తాము ఎ లాంటి ఒప్పందం చేసుకోలేదని, ఇ జ్రాయెల్ కాల్పలు విరమణకు ముం దుకొచ్చి దాడులు ఆపేస్తే తామూ ఆపేస్తామని ఇరాన్ విదేశాంగ మం త్రి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆ త ర్వాత కొద్దిసేపటికే టెల్అవీవైఫై టె హ్రాన్ దాడులు ముగిశాయని పరో క్షంగా చెప్పారు.
ఇజ్రాయెల్ దాడు లను తాము ధీటుగా పోరాటం చే శామని చెబుతూ కాల్పుల విరమ ణకు సిద్ధమేనన్న సంకేతాలిచ్చా రు. సీజ్ ఫైర్ ను అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ ఈ మేరకు ఓ ప్రకటన విడు దల చేసింది. ఇరాన్ నుంచి అణు ముప్పు తొల గిపోయిందని పేర్కొం ది. ఇందుకు సహకరించిన అమెరి కా అధ్యక్షుడు ట్రంప్ కు కృతజ్ఞత లు తెలియజేసింది.