–224 మంది దుర్మరణం, 1200 మందికి పైగా గాయాలు
Israel Iran attacks :ప్రజా దీవెన ఇరాన్: ఇజ్రాయెల్ ఇ రాన్ పై భీకర దాడులతో విరుచు కుపడుతోoది. ఇప్పటివరకు 224 మంది చనిపోయారని, 1200 మం దికి పైనే గాయపడ్డారని ఇరాన్ అధి కారికంగా ప్రకటించింది. అణ్వస్త్ర క్షేత్రాలు, ఆయిల్ క్షేత్రాలే లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ నిన్నటి నుం చి నేటి తెల్లవారుజాము వరకు క్షిప ణులతో విరుచుకుపడింది. ఇరాన్ కూడా వందల మిస్సెళ్లతో ప్రతి దా డికి దిగడంతో జెరూసలెం ప్రాంతా ల్లో సైరన్ల మోతలు మోగాయి. అం దరూ ఇళ్లలోనే ఉండాలని ఇజ్రాయె ల్ ప్రభుత్వం ప్రజలకు పిలుపుని చ్చింది. మిస్సెళ్లను ఐరన్ డోమ్ వ్యవతో సమర్థవంతంగా అడ్డుకు నేందుకు ప్రయత్నిస్తోంది. ఆదివా రం దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటిలిజెన్స్ చీఫ్ బ్రిగేడియర్ మొహమ్మద్ కజమీ, డిప్యూటీ చీఫ్ హసన్ మొహకిక్ మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ధ్రువీకరిం చిం ది. ఇరాన్ లో భారతీయులు జాగ్ర త్తగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ఇజ్రాయెల్ దాడుల ను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలి పింది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెత న్యా హు ఉద్రిక్తతలను తగ్గించాలని అంతర్జాతీయంగా వస్తున్న సూచన లను తోసిపుచ్చారు. టెల్ అవీవ్ తన సైనిక లక్ష్యాలను కొనసాగిస్తుం దన్నారు. ఫాక్స్ న్యూస్తో ఆయన మాట్లాడుతూ యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ అ ణ్వాయుధాలను బదిలీ చేయాలనే ప్రణా ళికలను ఇజ్రాయెల్ నిఘా సంస్థలు బయ టపెట్టాయని తెలి పారు. ఇరాన్ దాడిలో 10 ఏళ్ల బా లుడు, 9 ఏళ్ల బాలికతో సహా ఆరు గురు మరణించారని ఇజ్రాయెల్ అ ధికారికంగా ప్రకటించింది.