— బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్
Jajula Lingam is Goud : ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతో సామాజిక న్యా యం జరుగుతుoదనేది ఒక కట్టు కథ మాత్రమేనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ అన్నారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్,మెదక్ నిజామాబా ద్,అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తిని నియ మించడమే దీనికి నిదర్శన మన్నారు.
మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా వ్యతి రేకిస్తున్నామని ఎంతోమంది బడు గు బలహీన వర్గాల వారు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే వాళ్ళని కాదని కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికి కేటాయించడం కాంగ్రెస్ పార్టీలో కేవలం ఒకే కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని లింగంగౌడ్ బీసీ మేధావులకు సూచించారు.