–హస్తినలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి, జేఎంఎం సీనియర్ నేత చం పయీ సోరెన్ ముగ్గురు ఎమ్మెల్యే లు
–జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముం దే బీజేపీ తీర్ధం తీసుకోనున్న చంప యీ సోరెన్
Jharkhand Assembly Elections: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల (Jharkhand Assembly Elections)ముందు అనూ హ్య పరిణామం చోటుచేసుకుంది. జార్ఖండ్ (Jharkhand ) లో రాజకీయ సంక్షోభం ఏర్పడనుందా అన్న అనుమానాల కు బలం చేకూరుతోంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం సీనియర్ నేత చంపయీ సోరెన్ (Senior JMM leader Champai Soren)ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి ఆది వారం హస్తినకు చేరుకున్నారు. చంపయీ సోరెన్ బీజేపీ (Champai Soren BJP)లో చేరను న్నారంటూ గత రెండు రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తాజా పరిణామం బలం చేకూరు స్తోంది. నేను ఎక్కడైతే అన్నానో అక్కడే ఉన్నానని మీడియాకు చెప్పిన కొద్ది గంటల్లోనే ఆయన హస్తినకు పయ నమయ్యారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఢిల్లీ వచ్చినట్టు మీడియా అడిగిన ప్రశ్న కు ముక్తసరిగా ఆయ న సమాధా నమిచ్చారు.చంపయూ సోరెన్ ప్రస్తు తం హేమంత్ సోరెన్ సార థ్యంలోని జార్ఖాండ్ ప్రభు త్వంలో మంత్రిగా ఉన్నారు. జేఎం ఎం మాజీ ఎమ్మెల్యే లోబిన్ మెమ్ బ్రోమ్ ద్వా రా బీజేపీతో చంపయూ సోరెన్ సంప్రదింపులు జరుపుతు న్నారని తెలుస్తోంది. చంపయూతో పాటు లోబిన్ కూడా బీజేపీలో చేర నున్నారని సమాచారం.
ఐదు నెల లు కూడా తిరక్కుండానే తనను ముఖ్య మంత్రి పదవి నుంచి హే మంత్ సోరెన్ రాజీనామా చేయిం చడంపై చంపయీ సోరెన్ అసంతృ ప్తితో ఉన్నారని, అందుకోసమే బీజే పీలో చేరేందుకు ఆయన మార్గం సు గమం చేసుకున్నారని అభిజ్ఞ వర్గా ల భోగట్టా. అసంతృప్తి నేతలంతా కేంద్ర హోం మంత్రి అమిత్షాను (Home Minister Amit Shah) హస్తినలో కలుసుకోనున్నారని తెలుస్తోంది.మనీలాండరింగ్ కేసులో జనవరి 31న జేఎంఎం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్టు చేయడానికి ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో చంపయీ సోరెన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఐదు నెలల పాటు జైలులో ఉన్న హేమంత్ సోరన్ హైకోర్టు ఇచ్చిన బెయిలుపై ఇటీవల బయటకు రాగానే తిరిగి శానససభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. దీంతో చంప యీ సోరెన్ రాజీనామా చేయడం, హేమంత్ సీఎం పగ్గాలు చేపట్టడం వంటి వరుస పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే జా ర్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే చంపయీ సోరెన్ బీజేపీ తీర్ధం తీసు కోనున్నారని, బీజేపీ టిక్కెట్పైనే పోటీ చేసి హేమంత్కు గట్టి పోటీ ఇవ్వనున్నా రనే ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల గురించి తనకు తెలియదని, ప్రస్తుతం ఎక్కడున్నా నో అక్కడే ఉన్నానని చెప్పిన కొద్ది గంటల్లోనే చంపయూ సోరెన్ యూ టర్న్ తీసు కోవడంతో జార్ఖాండ్ రా జకీయాలు ఒక్కసారిగా వేడెక్కా యి.