Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jharkhand elections batti vikramarka : పెట్టుబడిదారుల నుంచి జార్ఖండ్ ను రక్షించండి

--ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి --డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

పెట్టుబడిదారుల నుంచి జార్ఖండ్ ను రక్షించండి

–ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి
–డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ప్రజా దీవెన, జార్ఖండ్: అదానీ, అంబానీ వంటి క్రోనీ క్యాపిటలిస్ట్ ( crony capitalism) నుంచి జార్ఖండ్ కు విముక్తి కల్పించాలని, ఇండియా కూటమి ( india alliance) అభ్య ర్థులను తాజా ఎన్ని క ల్లో భారీ మెజార్టీతో గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎఐసి సి సీనియర్ పరిశీలకుడు, స్టార్ క్యాంపెయినర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ( batti vikramarka mallu) అన్నారు. ఆది వారం జార్ఖండ్ రాష్ట్రం రాంఘర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ మీటింగ్ లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయ కులు, కార్యకర్త లకు ఆయన దిశా నిర్దేశం చేశారు.

చిత్తార్పూర్ సీ,డీ బ్లాక్ రాజరప్ప బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంద ర్భంగా ఝార్ఖండ్ ( jharkhand) ప్రజల పోరాట స్ఫూర్తిని కొనియా డారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లా డుతూ ఝార్ఖండ్ ప్రజ లకు సేవ చేసే అవకాశం కల్పించిన ఏఐసీసీ ( aicc) నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో రాహుల్ గాంధీ ( rahul gandhi) కాశ్మీ ర్ నుండి కన్యాకుమారి దాకా చేసి న జోడో ( jodo) యాత్రతో దేశంలో ప్రజాస్వామిక శక్తులను ఏకంచేశారని అన్నారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ రెండు సందే శాలు ఈ దేశానికి ఇ చ్చారని వివ రించారు. విద్వేషాలను (Hatreds) రగిలించే వారి చేతిలో ఈ దేశాన్ని పెట్టేందుకు మేము సిద్ధంగా లేము, విశాల భార తదేశంలో ప్రేమ అనే దుకాణం తెరిచి అన్ని జాతు లు, మతాలకు సమాన అవకాశా లు ఇస్తామని సందేశం ఇచ్చారని వివరించారు. అదే సందర్భంలో ఈ దేశంలోని వనరులు, సంపద, ప్రభుత్వ రంగ సంస్థలు ( Public sector organizations) ఈ దేశ ప్రజలకే చెందాలి తప్ప కొద్ది మంది క్రోనీ క్యాపిటల్ లిస్ట్ ల చేతిలో పెట్టేందుకు సిద్ధంగా లేమని సందే శం ఇచ్చారని తెలిపారు.

అదాని, అంబానీ( amboni) వంటి క్రోనీ క్యాపిటల్ లిస్ట్ ఈ దేశా న్నికాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పోరాటం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఇండియా కూటమి అభ్యర్థు లను గెలిపిస్తేనే ఝార్ఖండ్ వనరులు రక్షించబడతాయని అన్నారు. ఈ దేశ సంపద జనాభా నిష్పత్తికి అనుగుణంగా పంపిణీ జరగాలి అంటే రాజ్యాంగాన్ని రక్షించుకొ ని (Defend the Constitutio n) ముందుకు పోవాలి అందుకు ఇండియా కూటమి అభ్యర్థుల ను గెలిపించడమే మన ముందు ఉన్న లక్ష్యం అని తెలిపారు.

కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లో జార్ఖండ్ రాష్ట్రాన్ని పెట్టేందుకు బిజెపి( bjp ) ప్రయత్నిస్తుందని చైతన్యం గల కాంగ్రెస్ కార్యకర్తలు ఝార్ఖండ్ రాష్టాన్ని, ఇక్కడి వనరులను ఆ దోపిడీ దారుల నుండి కా పాడు కోవాల్సిందిగా పిలుపు నిచ్చారు. ఝార్ఖండ్ ప్రజలు డబ్బుకు లొంగి పోయే రకం కాదని వాళ్ళకి వివేచ న, విచక్షణ ఉందనీ ఆ ప రంపరను కాపాడాల్సిందిగా పిలుపు నిచ్చా రు. బ్లాక్, గ్రామ కాంగ్రెస్, పోలింగ్ బూత్ అధ్యక్షులు సమావేశమై విస్తృతంగా ఇంటింటి ప్రచా రం ( door to door campaign) నిర్వహించాలని తెలిపారు.

ఇండి యా కూటమి ఇస్తున్న హామీలు, మేనిఫెస్టోను ఓటర్లకు పెద్ద ఎత్తున వివరించాలని, విస్తృతంగా ప్రచా రం చేయాలని సూచించా రు. రాంఘర్ (ramghar)  అభ్యర్థి మమతా దేవిని భారీ మెజార్టీ తో గెలిపించాలని, అలాగే కూటమి అభ్యర్థులను అందరినీ గెలిపిం చాలన్నారు.ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఏఐ సీసీ నాయకు లు గులాం అహమద్ మీర్ ,ఏఐసీసీ సెక్రటరీ సిరివెళ్ల ప్రసాద్, ఝా ర్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కేశవ్ కమలేష్ మహతో, షహ్ నాజ్ అన్వర్ , మైనారిటీ సెల్ అధ్యక్షులు తారీక్ అన్వర్ ,షకీల్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు స్థానిక నియోజక వర్గ నాయకులు, మండల గ్రామ స్థాయి నాయకులు పా ల్గొన్నారు.

Jharkhand elections batti vikramarka