Judge Justice Sujoy Pal : ప్రజా దీవెన, హన్మకొండ: శాంతి యుతమైన సమాజాన్ని స్థాపించ డానికి కమ్యూనిటీ పెద్దలు నడుం బిగించాలని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ పిలుపునిచ్చారు.
సమాజంలో వ్యక్తులు, సమూహాల మధ్య వచ్చే వివాదాలను శాంతి యుతంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల న్యాయ సేవ సంస్థ లు గుర్తించిన కమ్యూనిటీ మీడి యేటర్ల మూడు రోజుల శిక్షణ కా ర్యక్రమాలను చీఫ్ జస్టిస్ శుక్రవారం ఉదయం హనుమకొండలో ప్రారం భించారు.
అనంతరం చీఫ్ జస్టిస్ ప్రసం గిస్తూ ఏ వివాదమైనా ఒక వ్యక్తికి వ్యక్తి మధ్యనో లేదా వ్యక్తుల సమూహాల మధ్యనో ఏర్పడుతుందని, అయితే ఆ వ్యక్తి గాని సమూహం గాని ఏదో ఒక కమ్యూనిటీకి చెందిన వారై ఉం టారన్నారు. అటువంటి పరిస్థితిల్లో అదే కమ్యూనిటీకి చెందిన పెద్ద వా రు వారికి నచ్చచెప్పినట్లయితే వి వాదాలు సుహృద్భావ వాతావర ణంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఈ బృహత్తర ఆ లోచన నుంచి ఉ ద్భవించినదే క మ్యూనిటీ మీడియేషన్ విధానమ న్నారు.
మొదటిసారిగా భారతదేశంలో కే రళ రాష్ట్రంలో ఈ విధానం విజ యవంతం అయిందని పేర్కొన్నా రు. సమాజంలోని కమ్యూనిటీ పె ద్దలు కోర్టుల దాకా రాకుండా వేల సంఖ్యలో వివాదాలను పరి ష్క రించారన్నారు.
ఆ తరువాత ఈ విధానం మధ్యప్ర దేశ్ రాష్ట్రానికి చేరి అక్కడ కూడా విజయవంతమైందన్నారు. అయి తే 2023వ సంవత్సరంలో వచ్చిన మీడియేషన్ చట్టం ఈ విధానానికి చట్టబద్ధత కల్పించిందని ఆయన అన్నారు. ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాలుగా భార్యాభర్తల మధ్య తగాదాలు, తల్లిదండ్రులు పిల్లల మధ్య తగాదాలు సమాజంలో పెరి గిపోతున్నాయని వీటికి చక్కటి ప రిష్కారం కమ్యూనిటీ మీడియేషన్ అని జస్టిస్ సుజోయ్ పాల్ అన్నా రు.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛి న్నం కావడం, ఇంటిలో సర్ది చెప్పే పె ద్దలు లేకపోవడం భార్యాభర్తల మ ధ్య ఇగోలు ఏర్పడి వారి మధ్య వి వాదాలకు ఎక్కువగా కారణం అ వుతున్నాయని అన్నారు. వివాదా లను సమాజ కమ్యూనిటీ పెద్దలు పరిష్కరించాల్సిన అవసరం ఉం దన్నారు.
న్యాయస్థానాలలో కేసులు ఉంటే, ఇరుపక్షాలలో ఒకరు గెలిస్తే మరొ కరు పైకోర్టుకు వెళ్తారని కానీ క మ్యూనిటీ మీడియేషన్ విధానంలో వివాదం పరిష్కారమైతే వ్యక్తులే కాకుండా కుటుంబాలు కూడా సం తోషంగా ఉంటాయని ఇటువంటి గురుతర బాధ్యతను పెద్దలు తమ భుజస్కంధాల మీద వేసుకోవాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మ ధ్యప్రదేశ్లోని గ్వాలియర్ లో ఒక వి శ్రాంత వైస్ ఛాన్స్లర్ కమ్యూనిటీ మీడియేటర్ గా సాధించిన విజ యాలను వివరించారు. కలహిస్తు న్న భార్య భర్తలకు ఒక తండ్రి లాగా తాత లాగ నచ్చచెప్పి వారిని కలిపి నట్లు ఆయన చెప్పారన్నారు.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్ పంచాక్షరి మా ట్లాడుతూ నిజామాబాద్, కామా రెడ్డి, హైదరాబాద్ లో ఈ కమ్యూని టీ మీడియేషన్ వాలంటీర్లు విజ యవంతంగా పనిచేస్తున్నారని ప్ర శంసించారు. గత ఏప్రిల్ ఏడవ తా రీకున కామారెడ్డి లో ఒకేసారి 12 కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ల ను ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్, హను మకొండ జిల్లాల ప్రధాన న్యాయ మూర్తులు బి వి నిర్మల గీతాంబ, సిహెచ్ రమేష్ బాబు ఇతర జిల్లాల న్యాయమూర్తులు, వరంగల్ హను మకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం. సాయి కు మార్, క్షమా దేశ్ పాండే తదితరు లు పాల్గొన్నారు.