Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Judge Radha Rani : హైకోర్టు న్యాయమూర్తి రాధ రాణి కలిసిన బార్ అసోసియేషన్ నూతన కమిటీ

Judge Radha Rani : ప్రజాదీవేన, కోదాడ: గురువారం హైకోర్టులో సూర్యాపేట జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్ శ్రీమతి రాధరాణి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీ వినోద్ కుమార్ జస్టిస్ లక్ష్మణ్ లను కోదాడ బార్ అసోసియేషన్ నూతన కమిటీ కలిసి కోదాడ కోర్టు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు Ch. లక్ష్మినారాయణ రెడ్డి మాట్లాడుతూ కోదాడ కోర్టు బిల్డింగ్ త్వరగా పూర్తి చేయాలని, కోదాడ కు అదనపు జిల్లా న్యాయస్థానం ఏర్పాటు చేయాలని,ఖాళీగా ఉన్న జూనియర్ సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు P P పల్లె నాగేశ్వరరావు, కోదాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య, సీనియర్ న్యాయవాదులు మేకల వెంకటరావు,దేవబత్తిని నాగార్జున రావు,ch రామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ SV చలం,md హుస్సేన్, బండి వీరభద్రరావు పాల్గొన్నారు.