Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Justice Rajasekhar Reddy : కీలక నియామకం, తెలంగాణ లో కాయుక్తగా జస్టిస్‌ రాజశేఖర్‌ రెడ్డి

Justice Rajasekhar Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నియా మకం కోసం ఉత్తర్వులు జారీ చే సింది. తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టి స్‌ ఎ.రాజశేఖర్‌ రెడ్డి, ఉప లోకా యుక్తగా బీఎస్‌ జగ్జీవన్‌కుమార్‌ ల ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సందర్భంలో రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్‌ ఆర్సీ) చైర్మన్‌గా మరో రిటైర్డు న్యా యమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నియమితులయ్యారు.హెచ్‌ఆర్‌సీ సభ్యులుగా శివాడి ప్రవీణ, బి.కిషో ర్‌లను ప్రభుత్వం నియమించింది.

దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్, లోకాయుక్త, ఉపలోకాయుక్త పో స్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్య లు చేపట్టింది సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్య క్షతన సమావేశమైన సెలక్షన్‌ కమి టీ అభ్యర్థుల జాబితాను వడపోసి వీరి పేర్లను ఖరారు చేశారు.

జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నల్లగొం డ జిల్లా వాసి.. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సిర్సనగండ్ల గ్రామంలో ఓ వ్యవసాయ కుటుం బంలో 1960, మే 4న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జయప్రద, రామానుజరెడ్డి. హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీ నుంచి పట్టభద్రులైన ఆయన కాకతీయ విశ్వవిద్యాల యం నుంచి న్యాయశాస్త్రంలో బం గారు పతకం పొందారు. 1985, ఏ ప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌ అయ్యారు. తొలుత మహ మూద్‌ అలీ వద్ద ప్రాక్టీస్‌ చేశారు. నాలుగేళ్ల తర్వాత స్వతంత్రంగా ప్రా క్టీస్‌ మొదలెట్టారు.2004లో హైకో ర్టు న్యాయవాదుల సంఘం (హెచ్‌ సీఏఏ) ఉపాధ్యక్షుడిగా ఎన్నిక య్యారు.

2004లో కేంద్ర ప్రభుత్వానికి సీని యర్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా, 2005 లో అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ గా నియమితులయ్యారు. సెంట్రల్‌ ఎక్సైజ్, కస్టమ్స్, సర్వీస్‌ టాక్స్‌కు సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా కూ డా పని చేశారు. 2013, ఏప్రిల్‌ 12 న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2014లో శాశ్వత న్యాయ మూర్తిగా నియమితులయ్యారు. 2022, ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు.

జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ సైతం నల్లగొండకు చెందినవారే…
1961, జనవరి 1న నల్లగొండలో రహీమున్నీసా బేగం, జాన్‌ మహ మ్మద్‌కు జన్మించారు. నల్లగొండ నా గార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకామ్‌ చదివారు. నాగ్‌పూర్‌లోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లా నుం చి న్యాయపట్టా పొందారు. 1996 లో హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని పీజీ కాలేజ్‌ ఆఫ్‌ లా నుంచి ఎల్‌ఎ ల్‌ఎం పూర్తి చేశారు. 2006లో ఉ స్మానియా విశ్వవిద్యాలయం నుం చి డాక్టరేట్‌ పొందారు. 2002లో నల్లగొండ జిల్లా, సెషన్స్‌ జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత పలు కోర్టుల్లో పనిచేసిన ఆయన ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ప్రిసై డింగ్‌ ఆఫీసర్‌గా, ఆంధ్రప్రదేశ్‌ జ్యు డీషియల్‌ అకాడమీ అదనపు డై రెక్టర్‌గా విధులు నిర్వహించారు. హైకోర్టులో రిజిస్ట్రార్‌ (జ్యుడీషి యల్‌)గా పనిచేశారు. 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్య తలు చేపట్టిన ఆయన 2022 డి సెంబర్‌లో పదవీ విరమణ చేశారు.