Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jyoti Madhubabu: మాట నిలుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాదిగల పాలిటీ ఉత్తముడు
కాంగ్రెస్ ప్రభుత్వానికి మాదిగలు రుణపడి ఉంటారు : జ్యోతి మధుబాబు

Jyoti Madhubabu: ప్రజా దీవేన, కోదాడ:గత 30 సంవత్సరాల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్గీకరణ చేయడానికి ఎస్సీ వర్గీకరణ కమిటీకి నాయకత్వం వహించిన ఉత్తంకుమార్ రెడ్డి కీ నడిగూడెం మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు కృతజ్ఞతలు తెలుపారు. ఇ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశ రాజకీయాల్లోని ఉత్తంకుమార్ రెడ్డి ఓ నీతి నిజాయితీ ,నిబద్ధత గల వ్యక్తి అని, ఎంతో అపారమైన రాజకీయ అనుభవం గల వ్యక్తి ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీకి చైర్మన్ కావడం మాదిగ మరియు ఉప కులాల అదృష్టమని అన్నారు.

మరియు అందుకు సహకరించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి యావత్ మాదిగ జాతి రుణపడి ఉంటుందని , వర్గీకరణ విషయంలో దూరదృష్టి కలిగిన మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి కమిటీ చైర్మన్గా ఉండడం మూలంగానే ఇది సాధ్యమైందని ఇట్టి చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి మాదిగ జాతి రుణం పడి ఉంటుందని అన్నారు, కోదాడ స్థానిక శాసనసభ్యులు పద్మావతి రెడ్డి గారి సహకారం మరువలేనిదని అన్నారు