Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kalva kuṇṭla kavita: ప్రభుత్వ వేధింపులను సమష్టిగా ఎదుర్కొంటాం

— నిజా మాబాద్ ఎమ్మెల్సీ, తెలం గాణ జాగృతి అధ్యక్షురాలు కల్వ కుంట్ల కవిత

Kalva kuṇṭla kavita: ప్రజా దీవెన,జగిత్యాల: వేధింపుల కు తాము భయపడేది లేదని నిజా మాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జా గృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవి త అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా తమ నేతలపై ప్రభుత్వం వే ధింపులకు పాల్పడుతుందని, ఇ లాంటి వేధింపులకు తాము భయ పడబోమని, ధైర్యంగా అందరం కలి సికట్టుగా ఎదుర్కొంటామన్నారు.

సోమవారం జగిత్యాల జిల్లా కేం ద్రం లోని నవదుర్గ ఆలయం రెండో వార్షి కోత్సవం సందర్భంగా స్థానిక మహి ళలతో కలిసి కుంకుమ పూజలో పా ల్గొన్న ఎమ్మెల్సీ కవితకు ఆలయ అర్చకులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. ఈసం దర్భం గా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడి యాతో మాట్లాడారు.

వానాకాలం పంట సీజన్ మొద లైం దని, రైతులు రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్నార న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చిందని, అది కూ డా 60శాతం మంది రైతులకే ఇ చ్చిందని, మిగిలిన 40శాతం మంది కి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్ర భుత్వం సమాధానం చెప్పాలన్నా రు. నిరుడు యాసంగిలో ఇ చ్చిన ట్టు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకే భరోసా ఇస్తారా, లే దా రైతులందరికీ వర్తింపజేస్తారా అ నే దానిపై స్పష్టత ఇవ్వాల్సిన బా ధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు లకు, ప్రజలకు ఎన్నో హామీలిచ్చి అ ధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు.

రైతు భరోసా సహా అన్ని హామీల ను నెరవేర్చకుండా ఇచ్చిన మాట తప్పిందన్నారు. కనీసం వృద్ధులకు ఇచ్చే పింఛన్లు కూడా పెంచిన పాపా న పోలేదని, మహిళలకు రూ.2,50 0 ఇవ్వలేదని, ఇలా అన్ని హామీల ను కాంగ్రెస్ ఎగవేసిందన్నారు. హా మీల అమలుపై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని, తమ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్, హరీశ్ రావులకు నో టీసులు ఇచ్చిన ప్రభుత్వం వేధింపు లకు గురి చేస్తోందన్నారు. ఇటీవలే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ ను విచారించగా, తాజాగా కేటీఆర్ ను సైతం ఏసీబీ విచారిస్తోందన్నా రు. తాయు వేధింపులకు భయపడే వారం కాదని, కేటీఆర్ విచారణకు హాజరయ్యారన్నారు. కేటీఆర్ విచా రణ సందర్భంగా ప్రభుత్వం తెలం గాణ భవన్ కు తాళం వేయడం దు ర్మార్గమని, త‌మ కార్యకర్తలు, నా యకులను బయటికి రానివ్వకుం డా అడ్డుకోవడం దారుణమన్నారు. త‌మ పార్టీ లోపాలను సవరించు కుంటామని, త‌మ మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొం టామని స్పష్టం చేశారు. కాగా, తమ పార్టీ ఎంపీ దామోదర్ రావు ఎంపీ లాడ్స్ నుంచి రూ.90 లక్షలు నవ దుర్గ ఆలయ అభివృద్ధి కోసం ఇ చ్చారన్నారు. అలాగే జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దావ వసంత సురేష్ మరో రూ.10 లక్షలు ఇచ్చారన్నా రు.