Kamal Kaur: ప్రజా దీవెన, పంజాబ్: పంజాబ్కు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ కాంచన్ కుమారీ అలియా స్ కమల్ కౌర్ భాబీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. జూన్ 11వ తేదీ న ఆమె ఓ కారులో శవమై కనిపిం చారు. తాజాగా, కమల్ కౌర్ మృత దేహానికి పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కమల్ కౌర్ను గొంతు నులిమి చం పేశారని వైద్యులు తేల్చారు. కమల్ కౌర్ తొడలు, ప్రైవేట్ భాగాలపై అనుమానాస్పద గుర్తులు ఉన్నట్లు తేల్చారు.అయితే, ఆమెపై అత్యా చారం జరిగిందన్న విషయాన్ని మా త్రం వైద్యులు ధ్రువీకరించలేదు.
చనిపోవడానికి ముందు ఆమెపై అత్యాచారం జరిగిందా, లేదా అని తెలుసుకోవడానికి శ్వాబ్, విసెరా శాంపిల్స్ను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపారు. ఇక, కమల్ కౌర్ను తానే హత్య చేశానని నిహం గ్ అమ్రిత్పాల్ సింగ్ మెహ్రాన్ ప్రక టించాడు. అయితే, హత్య తర్వా త అతడు యూఏఈ పారిపోయా డు. ఇదే కేసుకు సంబంధించి ఇద్ద రు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తు న్నారు.వాహనాల ప్రమోషన్ కోసం పిలిచి..
కమల్ కౌర్కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరచు గా వైరల్ అవుతూ ఉండేది. కొద్ది రోజుల క్రితం నిందితుడు నిహంగ్ అమ్రిత్పాల్ సింగ్ మెహ్రాన్ .. కమల్ కౌర్ను కాంటాక్ట్ అయ్యాడు. బతిం దలో వాహనాల ప్రమోషన్ ఉందని ఆమెను నమ్మించాడు. లుథియానా నుంచి ఆమె జూన్ 9వ తేదీన వా హనాల ప్రమోషన్ కార్యక్రమానికి వెళ్లింది. ఆ తర్వాతి నుంచి కనిపిం చకుండా పోయింది. జూన్ 11వ తేదీన కారులో శవమై తేలిన విషయం తెలిసిందే.