Kancharla Bhupal Reddy: ప్రజాదీవెన నల్గొండ టౌన్: ఆచార్య జయశంకర్ 14వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ మున్సిపల్ కార్యాలయం పక్కన గల విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలను జాగృతపరచి.. కెసిఆర్ కు వెన్నంటి ఉండి రానే రాదనుకున్న తెలంగాణను రావడానికి విశేష కృషి చేసినవారు ఆచార్య జయశంకర్ అని కొని ఆడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వార ఆశయాలను వారు కన్న కలలను నిజం చేయటమే వారికి మనం ఇచ్చే గొప్ప నివాళి అని అన్నారు.
రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, చీర పంకజ్ యాదవ్, జి. వెంకటేశ్వర్లు, బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీలు, ఎస్కే కరీం పాషా, నారబోయిన బిక్షం, బొజ్జ వెంకన్న, మాజీ జడ్పీటీసీలు తండు సైదులు గౌడ్, తుమ్మల లింగస్వామి, పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, అభిమన్యు శ్రీనివాస్, కొండూరు సత్యనారాయణ కనగల్ నల్లగొండ తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు అయిత గోని యాదయ్య,దేప వెంకటరెడ్డి, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు మారగొని గణేష్, రావుల శ్రీనివాస్ రెడ్డి, దండంపెల్లి సత్తయ్య, జమాల్ ఖాద్రి, కందుల లింగయ్య, లక్ష్మయ్య, బడపుల శంకర్, తవిటి కృష్ణ, విద్యార్థి నాయకుడు బొమ్మరబోయిన నాగార్జున,ఎస్కే. లతీఫ్, కంకణాల వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
