–ఢిల్లీలోని ఎయిమ్స్ తరలింపు
–వైరల్ ఫీవర్,గైనిక్ సమస్యలు న్నాయన్న వైద్యులు
–ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడి
Kavitha: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కవిత (Kavitha) అస్వస్థతకు గురయ్యా రు. జైలు డాక్టర్ల సూచనల మేరకు అధికారులు ఆమెను రాజధానిలోని ఎయిమ్స్కు తరలించారు. ఆసుపత్రిలో (hospital) ఆమెకు పరీక్షలు నిర్వ హించడం ద్వారా కవిత వైరల్ ఫీ వర్, గైనిక్ సమస్యలతో బాధప డుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. అంతకుముందు జులై 16న కవిత జైల్లోనే (Kavita is in jail)అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు ఆమెకు జ్వరం రావడం తో పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్లో గల దీనదయాళ్ ఆసుపత్రికి తర లించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను తిరిగి జైలుకు తీసుకువె ళ్లారు. ఇప్పుడు ఆమెకు ఎయిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. కవిత గత ఐదు నెలలకు పైగా తీహార్ జైల్లో ఉంటున్నారు. ఇటీవల ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు (Supreme Court)విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఆలోగా ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి సుప్రీంకోర్టు (Supreme Court) ఆదే శాలు జారీ చేసింది. అదే సమ యంలో 23వ తేదీలోగా రిజాయిం డర్ దాఖలు చేయాలని కవిత తర ఫు న్యాయవాదులను ఆదేశిం చింది.