KCR: ప్రజా దీవెన, హైదరాబాద్: అనారో గ్యంతో వైద్య చికిత్స పొందుతూ అకాల మృతి చెందిన పార్టీ సీనియ ర్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనా థ్ పార్థివ దేహాన్ని బీఆర్ఎస్ అధినే త కేసీఆర్, మాదాపూర్ లోని నివా సంలో సందర్శించి, పుష్పాలు సమ ర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా శోకతప్తులైన గోపీ నాథ్ భార్య, బిడ్డలను కేసీఆర్ ఓదా ర్చి వారికి ధైర్యం చెప్పారు. కుమా రుడు వాత్సల్యనాథ్ ను దగ్గరికి తీ సుకుని ఓదార్చారు. కష్టకాలంలో వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా మృదు స్వ భావి సౌమ్యుడు ఆప్తుడుగా వున్న గోపీనాథ్ మరణం సందర్భంగా వా రి పార్థివ దేహాన్ని చూసిన కేసీఆర్ కళ్ళు చెమర్చి, ఉద్వేగానికి గుర య్యారు.
ఈ సందర్భంగా వారితో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎం పీలు కేఆర్ సురేశ్ రెడ్డి, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మె ల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, పద్మారావు గౌడ్, మాధవరం కృష్ణారావు, కాలేరు వెం కటేశ్, కొత్తా ప్రభాకర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీలు నామ నాగేశ్వర్ రావు, మా లోత్ కవిత, జోగినపల్లి సంతోష్ కు మార్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎ మ్మెల్యే పువ్వాడ అజయ్, భాస్కర్ రావు, ఆశన్నగారి జీవన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, న రేందర్ రెడ్డి, పార్టీ నేతలు మాజీ ఎం పీ సీనియర్ నేత రావుల చంద్రశే ఖర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి తదితర పార్టీ నేతలు కే సీఆర్ వెంట పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
