–బిఆర్ఎస్ రజతోత్సవ పాటను
–ఆవిష్కరించిన అధినేత కేసీఆర్
KCR : ప్రజా దీవెన, హైదరాబాద్: బిఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సం దర్భాన్ని పురస్కరించుకొని రూ పొందించిన సరికొత్త పాటను ఆ పా ర్టీ అధినేత కేసిఆర్ గురువారం ఆవిష్కరించారు. ప్రముఖ రచ యిత , గాయకుడు , మాజీ ఎమ్మె ల్యే రసమయి బాలకిషన్ రచించి గానం చేసిన “బండెనక బండి కట్టి గులాబీల జెండ పట్టి …” బిఆర్ఎస్ రజతోత్సవ పాటను పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో ఆవి ష్కరించారు.
పార్టీ ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు బిఆర్ఎస్ ప్రస్థానాన్ని పే ర్కొంటూ రజతోత్సవం సందర్భంగా పాటలు , కళారూపాల్ని రూపొందిం చాలని ఈ సందర్భంగా పార్టీ అధి నేత కేసీఆర్ రసమయికి సూచిం చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఉమ్మ డి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేలు , నాయకులు పాల్గొన్నారు.