Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kedarnath Yatra: నిలిచిన కేదార్‌నాథ్ యాత్ర

Kedarnath Yatra: ప్రజా దీవెన, కేదార్‌నాథ్:కేదార్‌నాథ్ యాత్ర (Kedarnath Yatra) తాత్కాలికంగా నిలిపివే శారు. భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడి 18 మం ది గల్లంతయ్యారు. కేదార్‌నాథ్‌ యా త్రలో (Kedarnath Yatra) భారీ వర్షాలకు (rains) కొండ చర్యలు విరుగుపడుతుండడం తో 1600 మంది యాత్రికులు అందులో చిక్కుకున్నారు. భారీ వర్షాలకు (rains)విరిగి పడుతున్న కొండచరియల కారణంగా వెనువెంటనే ఎన్డీఆర్‌ ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ బృందా లు సహాయక చర్యలు ప్రారంభిం చాయి. గౌరీకుండ్‌-కేదార్‌నాథ్‌ దారిలో భక్తులు చిక్కుకుపోయిన సంఘటనలో ఇప్పటి వరకు 3 వేల మందిని రెస్క్యూ టీమ్స్‌ రక్షించా యి. యాత్రలో గల్లంతైన వారికోసం సహాయక బృందాలు హెలికాప్టర్లు, డోన్లతో (Helicopters, with drones)గాలిస్తున్నాయి. హరిద్వార్‌, తెహ్రీ, డెహ్రాడూన్‌, చమోలీ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చి కేదారినాథ్ యాత్రకు ఆటంకం కలిగించడంతో పాటు వరదల్లో వేలాదిమంది చిక్కుకోవడంతో ఆందోళన నెలకొంది.