Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kejriwal:కేజ్రీవాల్ కు మళ్లీ చుక్కెదురు

–సిబిఐ దాఖలు చేసిన అవినీతి కేసులో జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగింపు

Kejriwal:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు (Delhi Excise Policy Case) సంబం ధించి మనీలాండరింగ్, అవినీతి కేసుల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal)జ్యుడీషియల్ కస్టడీని (Judicial Custody) ఎల్హిస్ రూస్ అవెన్యూ కోర్టు మరొకమారు పొడిగించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచా రిస్తున్న మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కస్టడీని స్పెషల్ జడ్జి కావేరీ బవేజా పొడిగించారు.జూలై 31 వరకు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దాఖలు చేసిన అవినీతి కేసులో అతని జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగించింది.తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.

అంతకుముందు, సిబిఐ (cbi) కేసులో కోర్టు అతని జ్యుడీషియల్ కస్టడీని జూలై 25 వరకు పొడిగించింది, అదే స్కామ్‌కు సంబంధించిన ఎన్‌ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కేసు లో సుప్రీంకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరో వైపు, మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకు డు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) నాయకురాలు కె. కవిత తో పాటు ఇతర నింది తుల జ్యుడీషియల్ కస్టడీని కూడా న్యాయమూర్తి జూలై 31 వరకు పొడిగించారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు. జూన్ 29న, ఎక్సైజ్ పాలసీ కేసులో (Delhi Excise Policy Case) కేజ్రీవాల్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించబడింది, జూలై 12న కోర్టు (court)లో హాజరుపరచాలని ఆదేశించిన మేరకు కోర్టులో హాజరుపరిచారు. జూన్ 26న కోర్టు కేజ్రీవాల్‌ను మూ డు రోజుల సీబీఐ కస్టడీకి అప్ప గించింది. జూన్ 29వ తేదీ రాత్రి 7 గంటలలోపు మళ్లీ కేజ్రీవాల్‌ను హాజ రుపరచాలని ఆయన లాయర్లు భార్యను రోజుకు ఒక సారి గంటపా టు కలిసేందుకు అను మతించా లని ఆదేశించింది.