Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Ponguleti : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణ యం, నల్లగొండ జిల్లా తిరుమ‌ల‌గిరి మండ‌లంలో కొత్త‌గా 4వేల మందికి భూప‌ట్టాలు

Minister Ponguleti : ప్రజా దీవెన, హైద‌రాబాద్ : పేద ప్ర జలు ద‌శాబ్దాల కాలంగా సాగు చే సుకుంటున్న భూములపై వారికి హ క్కులు కల్పించే విషయంలో మాన వీయ కోణంలో ఆలోచన చేయాల‌ ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌ మాచార పౌర‌సంబంధాల శాఖ మం త్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికా రుల‌కు సూచించారు.డాక్ట‌ర్ బి. ఆ ర్‌, అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో మంగ‌ళ‌వారం న‌ల్గొండ జిల్లా నాగా ర్జున సాగర్ నియోజకవర్గంలో భూ స‌మ‌స్య‌ల‌పై అట‌వీ శాఖ మంత్రి కొండా సురేఖతో క‌లిసి మంత్రి స‌ మావేశం నిర్వ‌హించారు. ఈ సమా వేశంలో మాజీ మంత్రి కె. జానా రె డ్డి, నాగార్జున సాగర్ శాసన సభ్యు లు కె. జ‌య‌వీర్ రెడ్డి, దేవ‌ర‌కొండ శా స‌న‌స‌భ్యులు బాలూ నాయిక్‌, రె వెన్యూ శాఖ సెక్రటరీ డి ఎస్.లోకేష్ కుమార్, పిసిసిఎఫ్ డాక్ట‌ర్ సి. సువ‌ ర్ణ‌, నల్గొండ కలెక్టర్ ఐలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

ఈసంద‌ర్బంగా మంత్రి మాట్లాడు తూ చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌ను సా కుగా చూపించి స‌మ‌స్య‌ల‌ను జ‌ఠి లం చేయ‌వ‌ద్ద‌ని అట‌వీశాఖ అధి కా రుల‌కు సూచించారు.నాగార్జున సా గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో 40-50 సంవ‌ త్స‌రాల నుంచి సాగు చేసుకుంటు న్న భూముల‌పై గిరిజ‌నుల‌కు హ‌ క్కులు క‌ల్పించ‌డానికి త‌మ ప్ర‌భు త్వం చిత్త‌శుద్ధితో ఉంద‌ని అయితే వివిధ నిబంధ‌న‌లు చూపుతూ ఆ భూములు అట‌వీశాఖకు చెందిన‌ వ‌ని అట‌వీ అధికారులు కొర్రీ వేస్తు న్నార‌ని అన్నారు.

ఈ అంశంపై రెవెన్యూ , ఫారెస్ట్ వి భాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్కారం చూ పేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదే శించారు.భూభార‌తి పైల‌ట్ ప్రాజెక్ట్ లో భాగంగా నాగార్జున సాగ‌ర్ అ సెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని తిరు మ‌ లగిరి ( సాగ‌ర్‌) మండ‌లాన్ని ఎంపిక చేసి ప్ర‌యోగాత్మ‌కంగా స‌ర్వే నిర్వ‌ హించ‌డం జ‌రిగింద‌ని ఈ పైల‌ట్ ప్రాజెక్ట్ కోసం 235 స‌ర్వే నెంబ‌ర్ల‌ను ఎంపిక చేయ‌డం జ‌రిగింద‌ని తెలి పారు. మొత్తం 23వేల ఎక‌రాలో స‌ర్వే నిర్వ‌హించ‌గా అందులో 12 వేల ఎక‌రాలు ప్ర‌భుత్వ భూమిగా గుర్తించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఇందులో 8వేల ఎక‌రాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయ‌ని తెలిపా రు. వీటిలో 4 వేల ఎక‌రాలు పాసు పుస్త‌కాల‌తో సాగులో ఉన్నాయ‌ని వివ‌రించారు. మిగిలిన 4037 ఎక‌రాల‌కు సంబంధించి కొత్త పాసు పుస్త‌కాలు ఇవ్వ‌వ‌ల‌సి ఉంద‌న్నారు.

అంతేగాక ఈ స‌ర్వేలో 2936 ఎక‌ రాల‌కు సంబంధించి 3069 మంది వ‌ద్ద బోగ‌స్ పాసు పుస్త‌కాలు ఉన్న‌ ట్లు గుర్తించి వారి పాసు పుస్త‌కాల‌ ను ర‌ద్దుచేశామ‌ని తెలిపారు. వీరికి రైతు భ‌రోసా, రైతు భీమా త‌దిత‌రా ల‌ను ర‌ద్దు చేశామ‌న్నారు. స‌ర్వేలో భాగంగా 7వేల ఎక‌రాలు అట‌వీ భూమిని గుర్తించామ‌ని, ఈ భూ ముల‌కు సంబంధించిన వివాదాల‌ ను వీలైనంత త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌ రించాల‌ని అధికారుల‌కు సూచిం చారు.