Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kishan Reddy: జాబ్ క్యాలెండర్ జాడేది

–రేవంత్ ప్రభుత్వం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం

Kishan Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలుకు గ్యారంటీనే లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Govt) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శలు గుప్పించారు.అధికా రంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యా లెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మరిచిపో యిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలుకు గ్యారంటీనే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. శనివా రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి (Kishan Reddy) విలేకరులతో మాట్లాడు తూ టీజీపీఎస్సీ ఎదుట ధర్నాకు దిగిన బీజేవైఎం నేతల పై పోలీ సులు దాడి చేయడాన్ని ఖండిం చారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం పనిచేస్తున్నదని వెల్ల డించారు. సింగరేణి ప్రైవేటీకరణ శుద్ధ అబద్ధమని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అత్యంత పారదర్శకంగా బొగ్గు గనుల వేలం (Auction of coal mines) కొనసాగుతున్నదని, 107 బొగ్గు గనులు వేలం వేయగా భారీగా ఆదాయం సమకూరిందని వివ రించారు. బొగ్గు గనుల వేలం ద్వా రా వచ్చే ఆదాయంలో ఒక్కపైసా కూడా కేంద్రం తీసుకోదని, కార్మికుల సంక్షేమం కోసమే ఈ ఆదాయాన్ని ఖర్చు చేస్తామని కిషన్ రెడ్డి పేర్కొ న్నారు.


శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయా లను కొనసాగిస్తాం…

దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షిం చుకోవడం కోసం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ (Shyama Prasad Mukherjee)బలిదానం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వ ర్ధంతి సందర్భంగా ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రప టానికి ఆయన నివాళుల ర్పించారు.