–గాంధీభవన్, తెలంగాణ భవన్ లు రెండూ దొందూ దొందే
–తప్పుడు ప్రచారంతోనే కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిoది
–వచ్చిన తర్వాత ప్రజలకు రేవంత్ చేసింది గుండు సున్నా
–పార్టీ పిరాయింపులు, ఢిల్లీకి కప్పం కట్టుడే ఆయన పని
— బిజెపి విస్తృతస్థాయి సమావేశం లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శ లు
Kishan Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: గాంధీ భవన్కు, తెలంగాణ భవన్కు తేడా లేదని కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు రెండూ దొందూ దొందే అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైద రాబాద్ శంషాబాద్లో శుక్రవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర బిజెపి విస్తృతస్థాయి (BJP is broad based) కార్యవర్గ సమావే శంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీ లు కవల పిల్లలని, తో బొట్టువులని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలిస్తే బీఆ ర్ఎస్ లో చేరుతారని బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ లో చేరుతారని ఎద్దే వా చేశారు.కెసిఆర్ (kcr)పాలనలో వంద లాది మంది కార్యకర్తలు జైలుకు వె ళ్ళారని, అనేకమందిపై అక్రమ కేసు లు పెట్టారన్నారు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో 10 సంవత్సరా లు కెసిఆర్ ప్రభుత్వం మీద పోరా టం చేశామన్నారు. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరి లో, రేవంత్ రెడ్డి (Revanth Reddy)ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections)బీజేపీ ,బీఆర్ఎస్ ఒకటే ననే కాం గ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలు కానీ హామీలు ఇచ్చి మభ్య పెట్టింద న్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అమిత్ షా వీడియోను మా ర్ఫింగ్ చేసిందని, రిజర్వేషన్ లు ఎత్తేస్తారని దుష్ప్రచారం చేసి లబ్ది పొందిందని విరుచుకుపడ్డారు. పార్ల మెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ విజయం సాధారణం కాద న్నారు. బీఆర్ఎస్ ఒక్క సీటు కూ డా గెలవలేదన్నారు. అసెంబ్లీ లుగా చూస్తే బీజేపీ 46 స్థానాల్లో మొదటి స్థానం వస్తె బీఆర్ఎస్ కేవలం 3 స్థా నాల్లో మొదటి స్థానం వచ్చింద న్నారు. కాంగ్రెస్ అతి తక్కువ కాలం లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిం దన్నారు. ఏ ఒక్క గ్యారంటీ నీ కూ డా పూర్తిగా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం లో ఎక్కడ చూసినా ఆందోళనలు, నిర సనలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఫిరాయింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు.
ఓ వైపు పిరాయింపులు.. మరో వైపు ఢిల్లీకి కప్పం కట్టడం ..
రాజకీయ ఫిరాయింపులు, తెలంగాణ (Telangana)ను దోచుకొని డిల్లీకి పంపించడం ఈ రెండు పనులు మాత్రమే కాంగ్రెస్ చేస్తుందన్నారు. కాంగ్రెస్ తన మేని ఫెస్టో లో పార్టీ మారితే అనర్హత వే టు వేస్తానని పాంచ్ న్యాయ పేరు తో పెట్టిందన్నారు. నిస్సిగ్గుగా, అనై తికంగా చట్ట వ్యతిరేకంగా ఫిరా యింపుకి పాల్పడుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని ప్రతి రోజూ రేవంత్ రెడ్డీ నడి రోడ్డు మీద ఆవహేళన చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదని , భవిష్యత్ లో ఆరెండు పార్టీలు కలు స్తాయన్నారు. పొత్తు, గిత్తు ఉంటే ఆ రెండు పార్టీ ల మధ్యనే అన్నా రు. రెండు పార్టీ లు అవినీతి పార్టీ లే అన్నారు. బీజేపీ తెలంగాణ ప్రజ లతో ఉంటుందన్నారు. ఈ రాష్ట్రం లో మార్పు రావాలి అంటే, తెలం గాణ అభివృద్ధి చెందాలి అంటే, అమర వీరుల ఆకాంక్షలు నెరవేరా లంటే బీజేపీ మాత్రమే అధికా రంలోకి రావాలన్నారు. గడిచిన ఏడు నెలలో ఒక్క బెల్ట్ షాప్ ను కూడా తొలగించలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి దిశ దశ లేవని, భూ ములు, మద్యం అమ్మడం, అప్పు లు తేవడం అన్నారు.
బీఆర్ఎస్(brs), మజ్లిస్ తో కుమ్మక్కు అయినట్టే కాంగ్రెస్ మజ్లిస్ తో కుమ్మక్కు అయిందన్నారు. మజ్లిస్ కను సన్నల్లో నే ఈ రెండు పార్టీ లు పని చేస్తాయన్నారు. తెలంగాణ ను వ్యతిరేకించిన మజ్లిస్ తో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు అంట కాగుతున్నా యన్నారు. బీజేపీ నీ విమర్శించే నైతిక హక్కు ఈ పార్టీలకి లేదన్నా రు. తెలంగాణకు అన్యాయం జరిగి తే దానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లే బాధ్యత వహించాలన్నారు. ఎంఐ ఎం సభ్యుడు పాలస్తీనా కి జై కొట్టా రని, ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు సిగ్గుండాలన్నారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan)హాజరు కాగా రాష్ట్రానికి చెందిన మరో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేత లు పాల్గొన్నారు.