Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kolkata Docter: పిల్లలను కంటే ఆ బాధ తెలుస్తుంది

–బెంగాల్ సీఎం మమతపై మండి పడిన అభయ తల్లి

Kolkata Docter:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ (docter)అభయ(పేరు మార్చాం) హత్యాచార ఘటనపై మండిపడుతూ వైద్య విద్యార్థులు చేస్తున్న నిరసనలపై సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) వివాదాస్పద వ్యాఖ్యలు చేసి న విషయం విదితమే.కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ అభయ(పేరు మార్చాం) హత్యాచార ఘటనపై మండిపడుతూ వైద్య విద్యార్థులు చేస్తున్న నిరసనలపై సీఎం మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి న విషయం విదితమే. తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ (CM Mamata Banerjee) మాట్లాడుతూ జూనియర్ డాక్టర్లు తమ ఆందోళన విరమించి వెంటనే విధుల్లోకి హాజరు కావాలని కోరా రు. సమ్మె చేస్తున్న డాక్టర్ల భవిష్య త్తును దృష్టిలో పెట్టుకుని వారిపై కేసులు నమోదు చేయడం తనకు ఇష్టం లేదని వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు.

అయితే ఈ వ్యాఖ్య లను బెదిరింపుగా భావించిన డాక్ట ర్లు విధుల్లోకి చేరడానికి నిరాకరిం చారు.అయితే దీదీ వ్యాఖ్యలపై బాధితురాలు అభయ తల్లి మం డిపడ్డారు. మమతా (CM Mamata Banerjee)కామెంట్స్ తనకు నచ్చలేదని పేర్కొన్నారు. “ఆడబిడ్డను కోల్పోయిన మా కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని నేను నిరసనకారులు విన్నవిస్తున్నా. మాకు న్యాయం అక్కర్లేదని ముఖ్యమంత్రి అంటున్నారు. మమతకు పిల్లలెవరూ లేరు. ఒక తల్లి తన బిడ్డను కోల్పోతే ఉండే బాధ ఆమెకు అర్థం కాదు. అర్థం చేసుకోలేరు కూడా. మమత వ్యాఖ్యలతో మా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారని అభయ తల్లి భావోద్వేగానికి గురయ్యారు.