–కోర్టులో అసలు నిజాలు బైటపెట్టిన నిందితుడు సంజయ్రాయ్.
—జూనియర్ డాక్టర్ హత్య ఘటన లో రోజుకో ట్విస్టు
Kolkata Doctor Case:ప్రజా దీవెన, బెంగాల్: జూనియర్ డాక్టర్ హత్య (Kolkata Doctor Case)ఘటన లో రోజుకో ట్విస్టువెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై దేశంలో ఇప్పటికి కూడా నిరసలను మిన్నంటాయి. దీని వె నుకాల ఉన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకొవాలని కూడా అన్ని వర్గాల ప్రజల నుంచి డిమాండ్లు(demand)వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యం లో ఆగస్టు 9 ట్రైనీ డాక్టర్ అత్యా చార ఘటన వెలుగులోకి రాగానే నిందితుడు సంజయ్ రాయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. అతని బ్లూటూత్ ఘటన స్థలంలో లభ్యం కావడం, అతని కదలికలు సీసీ ఫుటేజీలో లభించ డం పట్ల కూడా ఈ ఘటనలో అత ని పాత్రపై బలం చేకూర్చాయి. అంతేకాకుండా సంజయ్ రాయ్ ను అరెస్టు చేసి పోలీసులు కోల్ కతా కోర్టు (KOLKATA COURT) ఆదేశాల మేరకు పాలీగ్రాఫ్ టెస్టు లు చేసేందుకు కోల్ కతా నుంచి నిపుణులు వచ్చినట్లు తెలు స్తోంది. ఈ క్రమంలో నిందితుడు మొ బైల్ లో అశ్లీల వీడియోలు, అతను సైకో ప్రవర్తనపై కూడా అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగే కొన్ని గంటల ముందు కూడా అతను, ట్రైనీ డాక్టర్ ను సీక్రెట్ ను ఫాలోఅయిన సీసీ ఫుటే జీ ఇటీవల వెలుగులోకి వచ్చింది.
మరోవైపు సీబీఐ కోర్టు చేసిన అనేక టెస్టులలో నిందితుడి బ్లడ్ సాంపు ల్స్, అతని వెంట్రుకలు, గోర్లు,యు వతి (Blood samples, his hair, fingernails, )శరీరంపై దొరికిన వాటిని బ్లడ్ సాంపు ల్స్, అతని వెంట్రుకలు, గోర్లు,యు వతి శరీరంపై దొరికిన వాటిని)తో మ్యాచ్ అయ్యాయి. ఈ నేపథ్యం లో నిందితుడికి సుప్రీంకోర్టు సెప్టెంబ ర్ 6 వరకు సీబీఐ కస్టడీకి అప్పగిం చింది. ఈ క్రమంలో నిందితుడు శుక్రవారం రోజున కోల్ కతా హైకోర్టు లో విచారణ సమయంలో తీవ్ర భావొద్వేగానికి గురయినట్లు తెలు స్తోంది. ఈ నేపథ్యంలో అతను చేసి న వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాం శంగా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..నిందితుడు సంజయ్ రాయ్ ను సీబీఐ పోలీసులు కోల్ కతాలోని హైకోర్టులో శుక్రవారం రోజున హ జరుపర్చారు.
ఈ నేపథ్యంలో న్యా యమూర్తి ముందు సంజయ్ రాయ్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తనను ఈ కేసులో కావాలని ఇరికించారిని కూడా భావో ద్వేగానికి గురైనట్లు సమా చారం. మరోవైపు కోర్టు ఆదేశాలు, నిందితుడి అంగీకారం ప్రకారం సీబీఐ (cbi)పాలిగ్రాఫే టెస్టును నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో జడ్జీ (judge) మాట్లాడుతూ నువ్వు తప్పు చేయనప్పుడు పాలీగ్రాఫ్ టెస్టుకు మరీ ఎందుకు అంగీకరించా వని న్యాయమూర్తి ప్రశ్నించారు.దీనికి సంజయ్ రాయ్ మాట్లాడు తూ ఈ టెస్టులలో అసలైన నిజాలు వెలుగులోకి వస్తాయని తాను అంగీ కరించినట్లు చెప్పాడు. కొంత మంది కావాలని తనను బలిపశువును చే శారంటూ కూడా సంజయ్ రాయ్ కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలు స్తోంది. అంతేకాకుండా సంజయ్ రా య్ తో పాటు మరో ఆరుగురికి సై తం పాలిగ్రాఫ్ టెస్టు చేయనున్నా రు. వీరిలో ఆర్ జీ కర్ ఆస్పత్రి ప్రిన్స్ పాల్ సందీప్ ఘోష్ సైతం ఉన్నారు. ఘటన జరిగక ముందు రాత్రి పూట వీరిలో నలురుగు ట్రైనీ డాక్టర్ తో కలిసి డిన్నర్ సైతం చేసినట్లు తె లుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం సీబీఐ పోలీసులు నిర్వహించనున్న పాలీగ్రాఫ్ టెస్టు లేదా లైవ్ డిటెక్టర్ టెస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.