Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Raja Gopal Reddy: పల్లెల్లో పర్యటిస్తూ, ఇల్లిల్లుతిరుగు తూ సమస్యలు తెలుసుకుంటూ

— గ్రామం అభివృద్ధి చెందాలంటే అందరూ కలిసికట్టుగా ఉండాలి
–అభివృద్ధి విషయంలో పార్టీల ర హితంగా ముందుకు సాగాలి
–మౌలిక సదుపాయాలు శాస్త్రీయం గా పకడ్బందీగా అభివృద్ధి చేసుకో వాలి
–మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

Komati Reddy Raja Gopal Reddy: ప్రజా దీవెన, మునుగోడు: గ్రామా ల లో చేసే అభివృద్ధి శాశ్వతంగా ఉం డాలంటే గ్రామస్తులందరూ ఏకతాటి పైకి వచ్చి ఒకరినొకరు సహకరించు కుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుం దని మునుగోడు శాసనసభ్యులు కో మటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శుక్రవా రం పొద్దు పొద్దునే మర్రిగూడెం మం డలం ఎర్రగండ్లపల్లి గ్రామానికి చేరు కొని గ్రామం మొత్తం కలియతిరిగా రు. కరెంటు లూస్ లైన్స్ గృహాలకు దగ్గరగా ఉండడంతో వాటిని వెంట నే మార్చాలని ఏఈకి చెప్పారు. గ్రా మాలలో పెరిగిన రద్దీని దృష్టిలో పె ట్టుకొని రోడ్లు డ్రైనేజీ కరెంట్ పో ల్స్, కరెంటు లైన్స్ , త్రాగునీటి పైపు లైన్ లను శాస్త్రీయంగా పకడ్బందీ గా అభివృద్ధి చేసుకోవాలన్నారు.

గ్రామీణ వాతావరణం ఉట్టి పడా లంటే గ్రామంలో గ్రామ పరిసరాల లో వీలైనన్ని మొక్కల్ని నాటాలన్నా రు. గల్లి గల్లి తిరుగుతూ ఎటువంటి సమస్యలు ఉన్నాయో ప్రజలని అ డిగి తెలుసుకున్నారు. మొదటి విడ తలో ఇందిరమ్మ ఇల్లులు మంజూ రు కానీ నిరుపేదల ఇళ్లలోకి వెళ్లి రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చా రు. విలేజ్ మ్యాప్(గ్రామ నక్ష) ను ముందు పెట్టుకొని చుక్క మురుగు నీరు నిలవకుండా డ్రైనేజీ సిస్టం ని అభివృద్ధి చేయాలని గ్రామ కార్యద ర్శిని ఆదేశించారు. ప్రభుత్వం నుం డి నిధులు తీసుకొచ్చే బాధ్యత నా ది అని గ్రామాన్ని అభివృద్ధి చేసుకో వడానికి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకు వచ్చి ఒకరినొకరు సహ కరించుకుని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు.

గ్రామ అభి వృద్ధికి పార్టీలకు సంబంధం లేదని అభివృద్ధి విషయం లో అన్ని పార్టీ లు కలిసి రావాల్సిందేనని అన్నా రు. గ్రామం శాశ్వతమైనదని ఎన్నో తరాలు ఇక్కడ జీవించాయని ఇం కెన్నో తరాలు జీవించాల్సిన గ్రామా న్ని కలిసికట్టుగా అభివృద్ధి పరుచు కోవాలన్నారు.శాసనసభ్యులతో మర్రిగూడ మండల ముఖ్య నాయ కులు, ఎర్రగండ్లపల్లి గ్రామ ముఖ్య నాయకులు, గ్రామస్తులు వివిధ శా ఖల అధికారులు పాల్గొన్నారు.