— రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy : ప్రజా దీవెన, తిప్పర్తి: దేశానికి రైతు వెన్నెముక అన్నది నిజం చేసి రైతు ల సంక్షేమానికి కృ షి చేస్తున్న ప్రభు త్వం తమదేనని రాష్ట్రరోడ్లు భవ నాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో పలు అభి వృద్ధి, సంక్షేమ కార్య క్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకు స్థాపన చేశారు.ముందుగా మంత్రి తిప్పర్తి మండలం పర్జూరులో పిఎ సిఎస్ భవనాన్నీ ప్రారంభిం చారు. అంతేకాక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ ను ప్రారంభిం చారు. అనంతరం తిప్పర్తిలో పిఎ సిఎస్ గోడౌన్ ప్రారంభించారు. నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే డిసిసిబి నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతు దేశానికే వెన్నెముక అనే నానుడిని నిజం చేసేలా తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ చేశామని, ఈనెల 26 నుండి రైతు భరోసా కార్యక్రమాలను అమలు చేయనున్నదని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సమయంలో రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం జరిగిందని, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో రుణమాఫీ చేశామని చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని ,రెండు లక్షల కన్నా పైనున్న రైతుల రుణాలు కూడా మాఫీ చేస్తున్నామని, ఎంతోమంది కోపరేటివ్ బ్యాంకులో రుణాలున్న వారు కూడా ఇందులో ఉన్నారని తెలిపారు. ఈనెల 26 నుండి రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములను గుర్తించి వారందరికీ రైతు రుణమాఫీ ఇస్తామని, వారం, పది రోజులలో రైతుల అకౌంట్లో.
ఈ డబ్బులు జమ కానున్నాయని ఆయన తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం 26 నుండి ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలు అమలు చేయనున్నదని చెప్పారు. 10 ఏళ్లలో రాష్ట్రప్రభుత్వం ఏ ఒక్కరికి ఇండ్లు కట్టించలేదని అన్నారు. రానున్న పది, పదిహేను రోజుల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద విడతకు 6000 చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలను ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు ఉండి గత సంవత్సరం కనీసం 20 రోజులు పని చేసిన వారందరికీ వారి అకౌంట్లో డబ్బులు పడనున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి, నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ,వీటన్నింటిని గ్రామసభలు నిర్వహించి గ్రామసభల్లోనే నిర్ణయం తీసుకుంటామని, పై నాలుగు పథకాల అమలులో ఎలాంటి పైరవీలకు తాగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినప్పటికీ నాలుగు నెలలు పార్లమెంటు ఎన్నికలతో గడిచిపోయిందని, ఎనిమిది నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేశామని చెప్పారు. తిప్పర్తి జంక్షన్ అభివృద్ధికి తొమ్మిది కోట్లు ఖర్చు చేయనున్నామని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ రైతు రుణమాఫీలో నల్గొండ జిల్లానే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులను ఉపయోగించుకోవాలని, త్వరలోనే తిప్పర్తి సహకార బ్యాంకుకు స్థలాన్ని మంజూరు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు .
ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ సంపత్ రెడ్డి ,ఆర్ అండ్ బి అధికారులు, ఆర్డిఓ అశోక్ రెడ్డి ,తహసిల్దార్ ,మాజీ జెడ్పిటిసి రామ్ రెడ్డి తదితరులు ఉన్నారు .