Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkata Reddy: రహదారుల అభివృద్ధికి అండగా నిలవండి

–కేంద్ర మంత్రి గడ్గరీ తో భేటీలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డివెంకటరెడ్డి

Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలంగాణ లోని విజయవాడ ఆరు లేన్ల రహ దారిని వెంటనే చేపట్టాలని రాష్ర్ట రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy Venkata Reddy) కోరారు. అదే సందర్భంలో ఉప్పల్ ఫ్లై (uppal fly over)ఓవర్ పనులు త్వరితగతిన పూ ర్తి చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari)సోమవారం భేటీలో మంత్రి కోమటిరెడ్డి లేవనెత్తారు. రోడ్లు, రహ దారుల అభివృద్ధి కోసం కేంద్రం ప్రవే శపెట్టిన ‘భారత్ మాల’ స్థానంలో కొత్త విధానం రాబోతోందని వెంకట్ రెడ్డి తెలిపారు. దిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో (Nitin Gadkari) భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ రాష్ట్రంలోని జాతీయ రహదా రుల అభివృద్ధి, తదితర అంశాలపై చర్చించినట్లు చెప్పారు. హైదరాబాద్, విజయవాడ హైవేను 6 లైన్ల రహదారిగా మార్చాలని కోరామ న్నారు. ఉప్పల్ ఘట్కేసర్ (Uppal Ghatkesar) మధ్య రహదారి 40 శాతమే పూర్తయింది. ఈ విషయం మంత్రి వద్ద ప్రస్తావిం చగా రహదారి పనులు త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చార న్నారు. ఉప్పల్-ఘట్కేసర్ ఫ్లై ఓవర్ టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని గడ్కరీ ఆదే శించారని చెప్పారు.

మంగళవారం కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి (kissan reddy), భూపేంద్ర యాదవ్ (Bhupendra Yadav) లను కలిసేందుకు అపా యింట్మెంట్ కోరామని మంత్రి కోమటిరెడ్డి (Komati Reddy Venkata Reddy) తెలిపారు. తెలంగాణలో ఓటు షేర్ పెంచుకున్నాని సుస్థిర పాలన అందిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkata Reddy) అన్నారు. 2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్ పై చర్చ జరుగుతుంది కానీ ముందుకు కదలడం లేదని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక రీజనల్ రింగ్ రోడ్ ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యం అయ్యిందని తెలిపారు. హైదరా బాద్ విజయవాడ రహదారిని 6 లైన్ల రహదారిగా మర్చాలని రోజుకి 60 వేల వాహనాలు తిరుగు తాయని చెప్పారు. 17 ప్రమాద జోన్లను గుర్తించామని తెలిపారు. త్వరగా హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లైన్ల రహదారి పను లు చేపట్టాలని కోరామని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) కోసం ప్రత్యేక సమావేశం పెడతామని చెప్పారని తెలిపారు. 16 రోడ్లు పెండింగ్ లో ఉన్నాయని నూతన జాతీయ రహ దారుల కోసం మరో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారని అన్నారు. ఉప్పల్ ఘాట్ కేసర్ ప్లయ్ ఓవర్ టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని అధికారులకు నితిన్ గడ్కరీ ఆదేశాలు జారీ చేశారని అన్నారు. రేపు కిషన్ రెడ్డిని కలుస్తానని తెలిపారు. వచ్చే మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు (Regional Ring Road), విజయవాడ – హైదరాబాద్ 6 లైన్ల రహదారిని పూర్తి చేస్తామని చెప్పా రు. ఇకపోతే తెలంగాణలో ఓటు షేర్ పెంచుకున్నాం సుస్థిర పాలన అందిస్తున్నామని అన్నారు. హైదరా బాద్ విజయవాడ రహదారిని 6 లైన్ల రహదారిగా మార్చాలన్నారు. రోజుకూ 60 వేల వాహనాలు తిరు గుతాయని, 370 చోట్ల ప్రమాద జోన్లను గుర్తించినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్దికి సహకరిస్తా మని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ను మర్యాద పూర్వకంగా కలుస్తామని, రేపు కిషన్ రెడ్డిని (kissan reddy) కలుస్తామని తెలిపారు. భుపెంద్ర యాదవ్ అటవీ పర్యావరణ అను మతుల గురించి చర్చిస్తామన్నారు. తెలంగాణ ఎంపీల ప్రమాణస్వీకారా నికి హాజరవుతునట్లు తెలిపారు. తాను అభిపవృద్ధి పనుల కోసం వచ్చానని స్పష్టం చేశారు. నేషనల్ హైవే నిధులు ఎక్కువగా తెలంగా ణకు ఇవ్వాలని కోరామన్నారు.