Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati reddy raja gopal reddy: పలకరింపులతో కలియతిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ

–పార్టీలకతీతంగా అర్హతకలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు
–మునుగోడు పలివెల పర్యటనలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

Komati reddy raja gopal reddy : ప్రజా దీవెన మునుగోడు: నియోజక వర్గంలో అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లులు ఇప్పించే బాధ్య త నాదని, మొదటి విడతగా కొంద రికి వచ్చాయి రెండో విడతలో ఇం కొందరికి వస్తాయని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. పార్టీలకతీతం గా నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించే బాధ్యత నాదని స్పష్టం చేశారు. గురువారం మును గోడు మండలం పలివెల గ్రామంలో కలియ తిరుగుతూ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సిసి రోడ్లతో పాటు డ్రైనే జీలు చేపట్టాల్సిన ప్రాంతాలను, ఇ ళ్లపై నుండి వెళ్తున్న విద్యుత్ తీగల ను పరిశీలించారు. పలివెల నుండి ఊకొండి వెళ్లే రహదారిని, పలివెల నుండి చీకటిమామిడి వెళ్లే రహదా రిని పరిశీలించారు. వాడ వాడ తి రుగుతూ మహిళలను ఆత్మీయం గా పలకరించారు. గ్రామంలో వున్న ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో చదువుల నాణ్యత పెంచాలని ప్రభుత్వ ఉపా ధ్యాయులకు సూచించారు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యా ర్థులకు ఫర్నిచర్ లైట్లు ఫ్యాన్లు లేవ ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఫ ర్నిచర్ ఇప్పించే బాధ్యత నాదని, సామాజిక బాధ్యతతో లైట్లు ఫ్యాన్లు మీరే ఇప్పించాలని హితవు పలికా రు.

ప్రభుత్వ పాఠశాలలో చదువు తూ పదవ తరగతిలో మంచి మా ర్కులు తెచ్చుకుంటున్న విద్యార్థు లకు తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ప్రోత్సహించి మెమెం టోలు అందజేస్థామని తద్వారా ప్ర భుత్వ విద్యను ప్రోత్సహించాలని అన్నారు. ప్రభుత్వమే అన్ని చేయా లనుకుంటే అవ్వదని ఈ గ్రామం నుండి బయటికి వెళ్లి అభివృద్ధి చెం దిన వ్యక్తులు తమ సామాజిక బా ధ్యతగా గ్రామాభివృద్ధికి పాటుపడా లని పిలుపునిచ్చారు. పలివెల గ్రా మంలో డ్రైనేజీ సిస్టంను శాస్త్రీయం గా నిర్మించాల్సిన అవసరం ఉంద ని దానికోసం ప్రణాళికలు చేపట్టా లని అధికారులను ఆదేశించారు. గృహాల పైన ఉన్న విద్యుత్ తీగల ను వెంటనే తొలగించి, గృహాల మ ధ్యలో రక్షణ కవచం లేకుండా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను షిఫ్ట్ చేయాలని విద్యుత్ అధికారులను కోరారు.

గ్రామంలో కొత్తగా ఎంతమంది అ ర్హు లకు పింఛన్లు రావాలి, ఎంతమం ది ప్రస్తుతం పింఛన్ తీసుకుంటు న్నా రు, వీరిలో వృద్ధాప్య పింఛన్లు ఎన్ని, వితంతు పింఛన్లు, గీత కార్మిక పిం ఛన్లు, చేనేత కార్మిక పింఛన్లు, ఎన్ని ఉన్నాయి ఇంకా ఎన్ని అవసరం ఉ న్నాయి అనే విషయాలకు సంబం ధించి జాబితాను సిద్ధం చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.

గ్రామాలలో బెల్ట్ షాపులను నిర్మూ లించిన తర్వాత పరిస్థితులు ఏర కంగా ఉన్నాయని గ్రామ మహిళల ను అడిగి తెలుసుకున్నారు. గ్రామా లలో వాతావరణం కొంత మెరుగైం దని ఇంకొందరు దొంగచాటుగా అ క్కడక్కడ బెల్ట్ షాపులు నిర్వహి స్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసు కు రాగా వాటిని పూర్తిగా నిర్మూలిం చాల్సిన బాధ్యత గ్రామ మహిళల పైనే ఉందన్నారు.

మీ గ్రామాన్ని అన్ని విధాల అభి వృ ద్ధి చేసే బాధ్యత నాది మీ గ్రామం లో బెల్ట్ షాపులు నిర్మూలించే బా ధ్యత మీదన్నారు.ఈ పర్యటనలో పలివెల కాంగ్రెస్ ముఖ్య నాయ కులతో పాటు, మునుగోడు మం డల ముఖ్య నాయకులు, గ్రామ కా ర్యదర్శి ఎంపీడీవో ఎంపీవో విద్యు త్ ఏఈలు పాల్గొన్నారు.