–రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనసా వాచా కర్మణా ఒక్కటై ముందుకెళ్దాం
— స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజ కవర్గం మొత్తం క్లీన్ స్వీప్ చేయాలి
— మునుగోడు పార్టీ శ్రేణులకు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
దిశా నిర్దేశం
Komati reddy raja gopal reddy: ప్రజా దీవెన మునుగోడు: రాజకీయ వ్యభిచారం చేయొద్దు విలువలతో కూడిన రాజకీయం చేయాలని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనసా వాచా కర్మణా అందరం ఏకమై మునుగోడు నియోజకవ ర్గంలో అన్ని స్థానాలు క్లీన్ స్వీప్ చేయాలని మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో నాంపల్లి మండల ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం లో నాయకులు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు… మన కళ్ళ ముందు రెండే రెండు లక్ష్యాలు కనిపిస్తున్నాయని ఒకటి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో సత్తా చాటడం, మరొకటి నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం అందరం ఏకతాటిపై కొచ్చి అభివృద్ధి చేసుకోవడమన్నారు… దేశం మొత్తం మునుగోడు వైపు చూసే విధంగా మునుగోడు నియోజకవర్గాన్ని రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకోవాలన్నారు… ప్రతి గ్రామంలో నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో నాంపల్లి మండలంలో ని ముఖ్య నాయకులతోపాటు అన్ని గ్రామాల నుండి వందలాది కార్యకర్తలు హాజరయ్యారు…