Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Krishna Waters : చౌటుప్పల్, నారాయణపూర్ మండలాలకు కృష్ణాజలాలు

— శివన్నగూడెం రిజర్వాయర్ నుం డి నీటి తరలింపుకు ప్రణాళికలు
–నీటిపారుదల శాఖ సమీక్షలో కో మటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

Krishna Waters :ప్రజా దీవెన, మునుగోడు: చౌటుప్ప ల్ పట్టణం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న సందర్భంలో భవిష్య త్తు అవసరాలను దృష్టిలో పెట్టుకు ని జనాభాకు సరిపడా తాగునీరు అందించడంతోపాటు, నారాయణ పూర్ చౌటుప్పల్ మండలాల్లోని చె రువులు కుంటలను నింపి భూగర్భ జలాలను రీఛార్జి చేసే విధంగా శివ న్నగూడెం రిజర్వాయర్ నుండి నీ టిని తీసుకొచ్చేలా ప్రణాళికలు రూ పొందించాలని కోమటిరెడ్డి రాజ్ గో పాల్ రెడ్డి సూచించారు. డిండి ఎత్తి పోతల పథకంలో భాగంగా మును గోడు నియోజకవర్గంలోని లక్ష్మా పు రం శివన్న గూడెంరిజర్వాయర్ల కు కొనసాగింపుగా నారాయణ పూ ర్ చౌటుప్పల్ మండలాలకు నీరందిం చడానికి కావలసిన ప్రణాళికలు సా ధ్యసాధ్యాల పై రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం సభ్యులు, ఇరిగేషన్ అధికా రులతో మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ రెండు మండలాలకు నీటిని తీ సుకొచ్చే విషయంలో తెలంగాణ రి టైర్డ్ ఇంజనీర్స్ ఫో రం సభ్యుల స లహాలు సూచనలు తీసుకున్నా రు. నీటిని తీసుకురావడానికి ప్ర ణాళికలు, చేపట్టాల్సిన పనులపై సమీక్షలో చర్చించారు

ఈ సమావేశంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం సభ్యులు శ్యాం ప్రసాద్ రెడ్డి ఇంద్రసేనారెడ్డి చంద్ర మౌళి సత్తిరెడ్డిలతో పాటు, గట్టు ప్పల్ డిఈ సురేందర్ రెడ్డి, గట్టు ప్పల్ ఏఈ భాగ్యలక్ష్మి లు పాల్గొ న్నారు.