— కేటీఆర్ పై కురిసిన ఏసీబీ ప్రశ్నల వర్షం
–దాదాపు 7 గంటలకు పైగా కొనసాగిన విచారణ
–మూడుసార్లు కాదు 30 సార్లైనా విచారణకొస్తామన్న కేటీఆర్
KTR: ప్రజా దీవెన, హైదరాబాద్: ఫార్ములా -ఈ కార్ రేసు కేసులో బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం బంజారాహి ల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాల యానికి చేరుకోగా అడ్వకేట్ రామ చందర్రావుతో కలిసి లోపలికి అ నుమతి ఇచ్చారు. ఈ కేసులో ఏ1 గా ఉన్న కేటీఆర్ను ఏసీబీ జాయిం ట్ డైరెక్టర్ రితురాజ్, డీఎస్పీ శర్మ, కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజీద్ ఖాన్తో కూడిన ఐదుగురు సభ్యుల బృందం ప్రశ్నిస్తోంది. ఈ కేసులో ఇ ప్పటికే ఈ ఏడాది జనవరిలో కేటీఆ ర్ను విచారించిన ఏసీబీ ఈనెల 13వ తేదీన రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నే డు విచారణకు హాజరయ్యారు. ని ధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీ కి నగదు బదిలీకి సంబంధించి ఆ యనపై ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తు న్నట్లు సమాచారం. ఎఫ్ఈవో కంపె నీకి చెందిన ప్రతినిధులతోపాటు ఈ కేసులో మరికొంతమంది ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా విచారిస్తు న్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ భవన్ వద్ద ఆం క్షలు కేటీఆర్ విచారణ నేపథ్యం లో ఏసీబీ ఆఫీస్ ముందు పోలీసు లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణు లు ఏసీబీ కార్యాలయంవైపు రాకుం డా భారీగా పోలీసులు మోహరిం చారు. అలాగే తెలంగాణ భవన్ గేటుకు పోలీసులు తాళం వేశారు. మరోవైపు ఇవాళ సీఎం పోలీస్ క మాండ్ కంట్రోల్ సెంటర్కు వచ్చిన నేపథ్యంలో అటువైపు బీఆర్ఎస్ శ్రేణులు దూసుకురాకుండా ముం దస్తు చర్యలు చేపట్టారు. ఆ పరిసర ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించ డమే కాకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్కు సమీపంలో ఉన్న నీలో ఫర్ కేఫ్ను క్లోజ్ చేయించారు.
వందసార్లైనా జైలుకు వెళ్తా..
తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడి యాతో మాట్లాడుతూ తనకు చట్టా లు, న్యాయస్థానాలపై గౌరవం ఉం దని అన్నారు. కేసీఆర్, హరీశ్రావు ను కాళేశ్వరం కమిషన్ ఎదుట కూ ర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందా రని విమర్శించారు. ఇప్పటికే మూ డుసార్లు పిలిచారని, 30 సార్లు పిలి చినా విచారణకు వెళ్తానని స్పష్టం చేశారు. తనను అరెస్టు కూడా చే యవచ్చని, అయితే తెలంగాణ కో సం గతంలోనే జైలుకు వెళ్లి వచ్చాన ని వ్యాఖ్యానించారు. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేద న్నారు. ఒక్కసారి కాదు వందసార్ల యినా జైలుకు వెళ్తానని, కానీ కేసీ ఆర్ లక్షల సైన్యాన్ని టచ్ చేసే ధై ర్యం మీకు ఉందా అని ప్రశ్నించారు. ఫార్ములా -ఈ కార్ రేసులో ఎలాంటి తప్పు చేయలేదన్నారు. సీఎం రేవం త్ రెడ్డిపైన కూడా ఏసీబీ కేసులు ఉ న్నాయని, లై డిటెక్టర్ పరీక్షలకు సి ద్ధమా అని కేటీఆర్ మరోసారి ము ఖ్యమంత్రికి సవాల్ విసిరారు.
సమాధానాలు దాటవేత ధోర ణి… ఫార్ములా-ఈ రేస్ కోసం ఒప్పందాలు, నిధుల విడుద కోసం కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ అను మతి లేకపోవడం, ఈసీ అనుమతి వంటి వివరాలపై ప్రశ్నలకు కొన్నిం టికి సమాధానం ఇచ్చిన కెటిఆర్ అనేక ప్రశ్నలకు దాటవేత ధోరణి అ వలంబించారని తెలుస్తోంది. గ్రీన్ కో తప్పుకో వడం, ఎలక్టోరల్ బాండ్స్ కొ నుగోళ్ల ద్వారా బీఆర్ఎస్కు వ చ్చిన నిధులు వంటి కీలక అంశాల పై సమాచారం రాబట్టిన్నట్లు తెలు స్తోంది.
న్యాయవాదులతో హరీశ్రావు చర్చోపచర్చలు… కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో మరోవైపు తెలంగాణ భవన్లో హ రీశ్రావు న్యాయవాదులతో సమా వేశం కావడం ఆసక్తిగా మారింది. ఏ సీబీ విచారణకు సంబంధించిన అం శాలపై వారితో చర్చిస్తున్నట్లు తె లు స్తోంది. విచారణ అనంతరం ఎ టు వంటి పరిస్థితులు ఉత్పన్న మవు తాయో అన్న ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి మాత్రం నెలకొంది.
ముగిసిన కేటీఆర్ విచారణ
ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో కేటీఆర్పై విచారణ ముగిసింది. అవ సరమైతే మరోసారి విచార ణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు ఆయనకు చెప్పారు. ఉదయం 10 గంటలకు బంజా రా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు కేటీ ఆర్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి అధికారులు కేటీ ఆర్ నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 7 గంటలకు పైగా విచారణ కొనసా గింది. అధికారులు 60కిపైగా ప్రశ్న లు అడిగినట్లు తెలుస్తోంది.
ఏసీబీ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. ”చట్టం మీద గౌరవం ఉంది కాబట్టే ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చె ప్పాము .ఇది మూడోసారి విచా రణకు పిలవటం. మూడుసార్లు కాదు 30 సార్లు అయినా విచారణ కు వస్తాం. విచారణకు సహకరి స్తాం.కేసీఆర్, హరీష్ రావులను కాళేశ్వరం కమిషన్ల ముందు కూ ర్చోబెట్టారు. వారిని కమిషన్ ముం దు కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నన్ను ఏసీబీ విచారణకు మళ్లీ మళ్లీ పిలుస్తున్నా రని” కేటీఆర్ ఆరోపించారు.