Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KTR: పచ్చకామర్లొచ్చినోళ్ళకు లోకమం తా పచ్చగానే కనబడుతుంది

–ఐఏఎస్‌, ఐపీఎస్ లు దేశ ప్ర‌జా స్వామ్యానికి వెన్నెముక‌
–ఎక్స్ వేదిక‌గా సీఎం రేవంత్ వ్యా ఖ్యలపై కేటిఆర్ గరం

KTR: ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: ఐఏఎస్ అధికారుల‌పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రె సిడెంట్ కేటీఆర్ గరంగరం అయ్యా రు. ఐఏఎస్‌, ఐపీఎస్ అదికారులు దేశ ప్ర‌జాస్వామ్య విధానానికి వెన్నె ముక‌, సివిల్ స‌ర్వెంట్ల నినాదం ఎక్స‌ లెన్స్ ఇన్ యాక్ష‌న్‌ ఏసీ అండ్ ఇనాక్ష‌న్ కాద‌ని కేటీఆర్ అన్నారు. ఈమేర‌కు మంగ‌ళ‌వారం ఆయన ఎక్స్ వేదిక‌గా ట్వీట్ చేశారు. ము ఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై కేటీ ఆర్ ఘాటు వ్యాఖ్య‌ల‌తో విరుచు కుప‌ డ్డారు. “పచ్చకామెర్లు వ‌చ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. మీరు బ్యాగులతో దొరికారని, అం దరూ మీ లాగానే బ్లాక్‌మెయిల్‌ దం దాలు చేస్తారని సెటిల్‌మెంట్లు, దం దాలు చేస్తూ బ‌తుకుతున్నారని అ నుకోవడం తప్పని కేటీఆర్ పేర్కొ న్నారు.ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికా రులు మన దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముక.

సివిల్ సర్వెంట్ల నినా దం ‘ఎక్సలెన్స్ ఇన్ యాక్షన్స‌… అం తేకానీ, ‘ఏసీ అండ్‌ ఇనాక్షన్’ కాదని కేటీఆర్ అన్నారు. వారి గురించి సీఎం రేవంత్ మాట్లాడిన మాట‌లు కించ‌ప‌రిచేలా, అమర్యాదకరంగా ఉన్నాయని, బ్యూరోక్రాటిక్ వ్య‌వ‌స్థ ప్ర‌తిష్ట‌ను నాశ‌నం చేసేందుకు ము ఖ్య‌మంత్రి నిరంత‌రం చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను తీవ్రంగా ఖండిస్తున్న ట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు.