–సివిల్ వ్యవహారాల్లో పలువురు పోలీసుల అరాచకాలు
–బాధితులకు బరాబర్ బరోసా కల్పిస్తాయి బిఆర్ఎస్ శ్రేణులు
–ఉల్టా కేసులు పెట్టి వేధించడం వల్లే కుంటయ్య వంటి ఆత్మహత్యలు
–సిరిసిల్లలో బీఆర్ఎస్ మాజీ ఎంపీ టీసీ కుంటయ్య కుటుంబ పరామ ర్శలో కేటీఆర్ ధ్వజం
KTR: ప్రజా దీవెన, సిరిసిల్ల: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన నాటి నుండి ఓపెన్ ఒప్పందా లకు అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు వేది కలయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎ మ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. కాం గ్రెస్ నేత భూమిని కబ్జా చేయడం తో ఆత్మహత్య చేసుకున్న బీఆర్ ఎ స్ ఎంపీటీసీ మాజీ సభ్యుడు కరక బోయిన కుంటయ్య కుటుంబాన్ని కే టీఆర్ బుధవారం పరామర్శించా రు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేశాడ ని ఫిర్యాదు చేస్తే కుంటయ్యపైనే ఉ ల్టా కేసు బనాయించి వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆరో పించారు.సివిల్ వ్యవహారాల్లో పో లీసులు జోక్యం చేసుకుని సెటిల్మెం ట్లు, అరాచకాలు చేయడం సమా జానికి ఎంతమాత్రం మంచిది కాద న్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చే ప్తే అది చేయడాన్నే డ్యూటీగా భా వించిన పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కుంటయ్య చావుకు కారణమైన పో లీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం చెస్తామని, ఎవరి ని వదిలి పెట్టమని హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్న పదేళ్ల కా లంలో బిఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా ఇంత చిల్లర లేకి పనులు చే యలేదన్నారు. మొన్న ఏసీబీ విచా రణ జరుగుతున్నప్పుడు తన కోసం హైదరాబాద్ దాకా వచ్చిన కుంట య్యను ధైర్యం చెప్పినా అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్న విష యం తెలిసి మనసు కకావికల మైం దన్నారు.
రాజకీయ నాయకులంటే అందరూ ఏదేదో ఊహించుకుంటారని, బయ టికి గంభీరంగా కనిపడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని ఓ వైపు ప్రజల కోసం పనిచేస్తూ మరోవైపు కుటుం బాన్ని కాపాడుకునే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతారన్నారు. కుంట య్య భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చే యడం, పోలీసులు కూడా ఆయన కే వత్తాసు పలకడంతో కుంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే పార్టీ నేతలను పంపి ఆయనను కాపాడు కునేందుకు శాయశక్తులా ప్రయత్నిం చినా సాధ్యం కాలేదన్నారు.
*కుంటయ్య పిల్లల బాధ్యత నాదే…* పార్టీలో నిబద్దత గల నా యకుడు, నిఖార్సైన గులాబీ సైని కుడైన కుంటయ్య ఇద్దరు పిల్లల చ దువులు, వారి పెళ్లిళ్లు, ఇతర సమ స్యలు అన్నింటికీ తనదే బాధ్యత అ ని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కుంట య్య కుటుంబానికి పార్టీ పూర్తి స్థా యిలో అండగా ఉంటుందన్నారు. ఇవ్వాళ కుంటయ్య, రేపు మరొకరి కి ఇలాగే జరగొచ్చని, ఈ అరాచకా లను ప్రభుత్వం అదుపు చేయాల న్నారు. పెద్దకర్మ జరిగేదాకా పార్టీ జి ల్లా నాయకత్వమే అన్ని పనులు ద గ్గరుండి చూసుకుంటుందన్నారు. కుంటయ్య ఆత్మకు శాంతి చేకూ ర్చాలని భగవంతున్ని కేటీఆర్ ప్రా ర్థించారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు ఉన్నారు.