Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KTR: భూములు తాకట్టుతో నిధుల సమీకరణ చేస్తారా

–తాక‌ట్టుపెడితే ప‌రిశ్ర‌మ‌లు ఎలావ‌స్తాయో చెప్పాలి
–ఈ మ‌తిలేని చ‌ర్య‌లను వెంట‌నే విర‌మించుకోవాలి

KTR: ప్రజా దీవెన, హైద‌రాబాద్: రాష్ట్రాన్ని పరిపాలించడం, ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ రెడ్డి (revanth reddy)ప్రభుత్వం అని బీఆర్ ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ధ్వజమెత్తారు. సిఎం రేవంత్ ప్రభు త్వం మతిలేని చర్యల్లో భాగంగా ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకుం దని విమర్శించారు. తెలంగాణ పరి శ్రమల శాఖకు చెందిన రూ. 20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను (Government lands) ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్న ట్టు సమాచారం ఉందని మండిపడ్డా రు. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చం ట్ బ్యాంకర్‌ను పెట్టి వారికి రు.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు సిద్ధమైం దని మీడియాలో కథనాలు వస్తున్నాయని ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ లో (tweet) ఆరోపించారు. ‘ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడి, కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక, మన బిడ్డ లకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉంది.

కోకాపేట, రాయదుర్గం (Kokapet, Rayadurgam) వంటి ప్రాంతాల్లోనే ఎక్కు వగా ఐటీ పరిశ్రమలు (IT industries) వస్తున్నాయి. అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేట్‌ సంస్థలకు (private companies)తనఖా పెట్టడం అనా లోచిత చర్య. అసలే గత ఏడు నెల లుగా రాష్ట్ర పారిశ్రామికరంగం స్తబ్దు గా ఉంది. కొత్తగా పెట్టుబడులు రావడం లేదు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్క చూపులు చూస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు పరి శ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే, కంపెనీలకు ఏమిస్తారు కొత్త గా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి అని కేటీఆర్ (ktr)ధ్వజ మెత్తారు.