Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Lawyers : విధులు బహిష్కరించిన న్యాయవాదులు.

–న్యాయవాదుల రక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.
–న్యాయవాదిపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

Lawyers  : ప్రజాదీవేన,కోదాడ :సూర్యాపేటలో న్యాయవాది కిషోర్ పై జరిగిన దాడిని కోదాడ బార్ అసోసియేషన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. గురువారం కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని న్యాయవాదిపై దాడి చేసిన సంబంధిత వ్యక్తులపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని మరలా ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నాగుబండి కృష్ణమూర్తి, సుధాకర్ రెడ్డి, ఈదుల కృష్ణయ్య, పాలేటి నాగేశ్వరరావు, అక్కిరాజు యశ్వంత్, షేక్ కరిముల్లా, హుస్సేన్, ధనలక్ష్మి, మురళి, నయీమ్, అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు.