–ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొం టాం
–స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు చరమగీతం పాడుతాం
–బిఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్
Lingaiah Yadav: ప్రజా దీవెన సూర్యాపేట: తెలం గాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బిఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని కాంగ్రెస్ కి చరమగీతం పాడేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు వేదిక కానున్నాయని బి ఆర్ ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం జిల్లా బి.ఆర్.ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామపంచాయతీ ఎన్నికలు కావాలని మొదటి నుంచి బిఆర్ ఎస్ కోరుతుందని అన్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అనేక ఎన్నికల్లో బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయలేదని రాజ్యాంగపరంగా కాకుండా పార్టీపరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామనే తప్పుడు మాటలు మానుకోవాలి అన్నారు. గతంలో జరిగిన కులగణనలో కూడా బీసీల జనాభాను తగ్గించి 56% గా చూపించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాలేశ్వరం విషయానికి వస్తే కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ల వివరణలను తీసుకున్న గోష్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీనట్స్ ఇవ్వాలని అడగగా నేటి వరకు ఇవ్వకుండా దాట వేస్తుందన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టు మంత్రివర్గ ఆమోదంతో ప్రణాళిక బద్ధంగా ఇంజనీర్ల సూచన మేరకు కట్టడం జరిగిందని కెసిఆర్ పై, బిఆర్ఎస్ పార్టీపై కోపంతో కూలిన పిల్లర్ ను వంకగా చూపి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూలకు పెట్టిందన్నారు. కేటీఆర్ ఈ కార్ రేస్ నిర్వహణ మంత్రివర్గ ఆమోదంతో జరిగిందని చెల్లింపులు కూడా సక్రమంగా జరిగాయని స్పష్టత ఇచ్చాడన్నారు. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తున్న బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై 16 మాసాల్లో 15 కేసులు పెట్టి ప్రజలను రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ప్రశ్నించవద్దని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో కలసి బెదిరింపులకు పాల్పడడం మానుకోవాలన్నారు. రైతంగానికి యాసంగి రైతు భరోసాను ఇవ్వకుండానే వానాకాలం రైతు భరోసాను ఎన్నికల స్టంట్ లో భాగంగా ఇస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా గ్రామాల్లో కెసిఆర్ చేసిన ప్రతి కార్యక్రమాన్ని కనుమరుగు చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గ్రామాల్లో కనీసం కాలువలు తీసేందుకు బ్లీచింగ్ వేసేందుకు చర్యలు చేపట్టడం లేదన్నారు. రాష్ట్రంలో బీసీలకు మంత్రి పదవులు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలేదని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల చేతుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బిసి రిజర్వేషన్ బిక్ష కాదని బీసీల హక్కు అని రాజ్యాంగంలో బీసీల రిజర్వేషన్ పెంచుతూ చట్టం చేయాలన్నారు.
కెసిఆర్ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో పదవులు అనుభవిస్తున్న మీరు కెసిఆర్ పై కేసు పెట్టే అంత పెద్ద వాళ్ళ అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి మంత్రులపై చేస్తున్న ఆరోపణలను, పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని అన్నారు. రైతు భరోసా ఎన్నికల స్టంట్ లో భాగమేనని రైతులకు కేసిఆర్ ఇచ్చిన ఐదు లక్షల రైతు బీమాకు ఎగనామం పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, మాజీ ఎంపీపీ నెమ్మాది బిక్షం, మాజీ జెడ్పిటిసి జిడి బిక్షం, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్ తదితరులు ఉన్నారు.