–ఆయనను పార్లమెంట్ కు పంప డం ముప్పు
–అసదుద్దీన్ పార్లమెంట్ వ్యాఖ్యల పై మండిపడ్డ మాధీవీలత
Madhavi latha: ప్రజా దీవెన, హైదరాబాద్: పార్లమెంట్ లో ఎంపీగా ప్రమాణస్వీకారం సందర్భంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ (MP Asaduddin) ఒవైసీ చేసిన వ్యాఖ్యల పై బీజేపీ నేత కొంపెల్ల మాధవీలత (Madhavi latha) తీవ్రంగా స్పందించారు. ఒవైసీ పార్లమెంట్ లో అల్లాహు అక్బర్ తో పాటు జై పాలస్తీన్ (Jai Palestine) అనడంపై ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు. అల్లా అన్న నోటితో జై పాలస్తీన్ అనడం ఏంటని, అతని ఉద్దేశాలు ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వారి వల్ల దేశ భద్రతకు ముప్పు అని తక్షణం ఇతణ్ని విచా రణ చేయాల్సి ఉందని ఓ వీడియోను విడుదల చేశారు. పార్లమెంటు లో జై బోలో భారత్ మాతాకీ(Bharat Mataki) అనా ల్సిన నోటి నుంచి జై పాలస్తీనా అనే మాట ఆయన నోటి నుంచి వచ్చిం దంటే దేశానికే దౌర్భాగ్యమని, ఇ లాంటివారిని ప్రోత్సహిస్తున్నందుకు 130 కోట్ల మంది భారతీయులు మనల్ని మనమే ప్రశ్నించు కోవాల్సి న సమయం ఆసన్నమైందన్నారు. రజాకార్ల నుంచి వచ్చి వారిని చంపి వారి ఎంఐఎం పార్టీని కైవసం చేసు కొని గత 40 నుంచి 50 ఏళ్ల నుంచి తెలంగాణలో పాలన చేస్తున్నారు. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వ స్తుందో వీరికి పి. మద్దతివ్వడం ఆన వాయితీగా వస్తోందని మండిపడ్డా రు. తమ్ముడు చిటికె వేస్తాడని, 15 నిమిషాల్లో ఖబడ్డార్ ఈ దేశాన్ని శ్మ శానం చేస్తా అంటాడు, నేను ఆపా ను కాబట్టే అతను ఆగుతున్నాడు లేదంటే ఏం చేస్తాడో చూస్కోండి అని అన్న అంటాడు. వీరు ఏం చే స్తారు జై పాలస్తీన్ అని పార్లమెం ట్లో అన్నప్పుడు వీరి మనస్తత్వం ఏంటి ఇలాంటి వారిని మనం పార్ల మెంట్లో లోకి తీసుకొచ్చి కూర్చో బెడుతున్నాం. ప్రశ్నించేవారు లేరా ఈ దేశ సంరక్షణ ఏ దిశగా వెళ్తాంది.
130 కోట్ల జనాభా మధ్యలో ఇలాంటి వారు మనతో ఉండడమే కాకుండా అక్రమ మార్గంలో ప్రజాప్రతినిధులై పార్లమెంటులో (Parliament as representatives of the people) కూర్చొంటే దానికి రక్షణ ఎక్కడుంది వీరు హమాస్ వాళ్లా వారి కోసం పని చేస్తారా హమాస్ ఆశయాలను భారత దేశంలో అమలు చేయడా నికో లేదా వారిని సంత్రుప్తి పర్చడం కోసం ఇక్కడ పని చేస్తున్నారా ఏ దేశంలో అయినా పుట్టిన వారు అదే తన మాతృభాష, మాతృభూ మిని పాటించి, అదే తన జీవిత లక్ష్యం అని అనుకుంటారు. వీరి ఉద్దేశం అలా లేదు, వీరెప్పుడూ పేరు, ప్రఖ్యాతి, డబ్బు కోసం పరి తపించే వికృతమైన వ్యక్తులు వీరు. భగవత్ నామం అల్లా అని పేరు చెప్పి, జై పాలస్తీన్ అన్నాడంటే అత ని మనస్సులోంచి వచ్చిన మాటల ని, అతను ఎందుకు ఈ మాటలు అన్నాడో కచ్చితంగా జాతీయ భద్ర తా మండలి వారు ఒవైసీని కూర్చో బెట్టి ప్రశ్నించాలి. అతని మదిలో ఏ ఆలోచనలు ఉన్నాయో తేల్చాలి. ఇప్పుడు కనుక మనం మేల్కోకపో తే, పరిష్కరించుకోకపోతే ఈ భారత్ శత్రువులకు (India’s enemies) పాలు పోసి పెంచినట్లు అవుతుందని మాధవీలత అ న్నారు.