–వరుస షాక్ లతో మల్లన్న ఉక్కిరి బిక్కిరి
–మల్లారెడ్డి అక్రమాలపై కొరడా జూలిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
–బాలానగర్ యూనివర్సిటీ పై చ ర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశం
Malla Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: పాలమ్మిన పూలమ్మిన అంటూ నవ్వులు పండించిన మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేతమాజీ మంత్రి మల్లారెడ్డికి (malla Reddy) అపశకునాలు ఎదురవుతు న్నాయి. తన మాటల చాతుర్యంతో ఆకట్టుకునే మాజీ మంత్రికి వరు సషాక్ లు తగులుతు న్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం (Congress pa rty) అధికా రంలోకి వచ్చాక మరి మల్లారెడ్డి అక్రమాలు ఒక్కొక్కటి గా వెలుగు చూస్తూ ఉండడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంటుంది.
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మల్లారెడ్డి అక్రమ నిర్మాణా ల (illegal construction)పై కొరడా ఝుళి పిస్తోంది. కబ్జాలపై నోటీసులు (notice) జారీ చేసి యాక్షన్ తీసుకుంటోంది. ఇదే క్రమం లో యూనిర్సిటీ ఆఫ్ క్యాం పస్ వ్యవహారం బయటికి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి అనుమతుల్లేకుండా మల్లారెడ్డి యూని వర్సిటీ బాలానగర్లో ఏర్పాటు చేసిన ఆఫ్ క్యాంపస్ కేంద్రంపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశా లు చేసింది.
ఎలాంటి అనుమతులు లేకుండా దూలపల్లిలోని మల్లా రెడ్డి యూని వర్శిటీ బాలానగర్లో సెంటర్ ఆఫ్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ కామర్స్ అండ్ డిజైన్ ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ నవీన ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ‘రాష్ట్ర ప్రభుత్వం యూజీసీల అనుమతులు లేకుండా ఆఫ్ క్యాంపస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయరాదు. ఈ పిటిషన్పై ఏప్రిల్ 25న ఈ కోర్టు జారీ చేసిన నోటీసులను పిటిషనర్ తరఫు న్యాయవాది అందజేస్తే మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు దానికి చెందిన ఆఫ్ క్యాంపస్ కేంద్రం కూడా తిరస్కరించాయి.
నోటీసును తిరస్కరించడం అంటే తీసుకున్నట్లుగానే భావించాలి. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన కేంద్రంలో బీకాం, బీఎస్సీ కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేపడుతు న్నారు. వాటిని చేపట్టకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలి.’ అని కోర్టును కోరారు.
ఈ వాదనలు విన్న న్యాయమూర్తి ఆఫ్ క్యాంపస్ కేంద్రం ఏర్పాటుకు యూజీసీ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతులు అవసర మని తెలిపారు. ఇదే విషయాన్ని పిటిషనర్తో పాటు ఎస్సీటీఈ, ఉస్మానియా యూనివర్సిటీల తరఫు న్యాయవాదులు కూడా ధ్రువీక రించారని చెప్పారు.నోటీసు జారీ చేసినప్పటికీ మల్లారెడ్డి యూనివ ర్సిటీ తరఫున ఎవరూ హాజరుకాలేదని, అంతేగాకుండా ఆఫ్ క్యాంప స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మల్లారెడ్డి యూని వర్సిటీకి ఎలాం టి అనుమతులు లేవని తేల్చిచెప్పారు.
మల్లారెడ్డి ఆఫ్ క్యాంపస్పై చర్యలకు ఆదేశం : అందువల్ల యూజీ సీ నిబంధనల ప్రకారం మల్లారెడ్డి యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ కేం ద్రంపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వరుసగా మల్లారెడ్డికి సంబం ధించిన యూనివర్సిటీపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో చె రువుల్లో నిర్మించిన అక్రమాలను అధికారులు తొలగించారు. అలా గే ఆయనకు సంబంధించిన అక్రమాలను ఒక్కొక్కటిగా అధికారులు గుర్తించి నోటీసులు పంపిస్తున్నారు.