ప్రజా దీవెన, సూర్యాపేట: మణప్పు రం గోల్డ్ లోన్ సంస్థలో కుదువ పెట్టిన బంగారాన్ని 40 రోజుల్లో 8సార్లు రుద్ది రుద్ది అరగదీయడం తో పాటు నగను చెడగొట్టారని సూర్యాపేటలో ఒక వ్యక్తి శనివారం మణప్పురం గోల్డ్ లోన్ సంస్థ ముం దు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుడు ఎర్రంశెట్టి గూడెం గ్రామానికి చెందిన నాగ బ్రహ్మచారి మాట్లాడుతూ తాను తయారు చేసిన మంగళసూత్రం తాడు సుమారు మూడున్నర తులాలును మనపురం గోల్డ్ లోన్ సంస్థలో పెట్టి 1,70,000 రుణంగా తీసుకున్నట్లు తెలిపారు.
40 రో జుల తర్వాత వినియోగదారు డికి బంగారు నగను ఇద్దామని గోల్డ్ లోన్ సంస్థలో విడిపించేందుకు వెళ్లానని తెలిపారు. రుణం మొత్తం కట్టి నగను విడిపించుకుని వెళ్లి చూస్తే మొత్తం ఎనిమిది చోట్ల రుద్దినట్టు కనిపించిందని తెలి పారు. తాము రుణం తీసుకు నేటప్పుడు ఒకసారి మాత్రమే రుద్దారని తర్వాత ఎనిమిది సార్లు రుద్దడంతో అవాక్కై సంస్థ వద్దకు వెళ్లి అడిగితే నిర్లక్ష్యంగా సమా ధానం చెబుతున్నారని తెలిపారు. మాకు వారానికి ఒకసారి ఆడిట్ ఉంటుంది మేము అలాగే రుద్ది చెక్ చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఇలా రుద్దడంతో బంగారు నగ పూర్తిగా చెడిపోయిం దని దీంతో తాను ఇవ్వాల్సిన విని యోగదారుడు కొత్త నగరం చేసి ఇవ్వమని అంటున్నట్లు తెలిపారు. కొత్త నగను చేసేందుకు ప్రస్తుతం మూడు గ్రాముల బంగారం అధికం గా అవసరం పడుతుందని ఆవేద న వ్యక్తం చేశారు.ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశానని తనకు తగిన న్యాయం చేయాల్సిం దిగా విజ్ఞప్తి చేశారు.