Mandal Medical Officer Dr. Shweta : ప్రజా దీవెన శాలిగౌరారం :గర్భిణీ స్త్రీలు పరిశుభ్రత పాటిస్తూ పౌష్టికాహారం తీసుకున్నపుడే ఆరోగ్యంగా ఉంటారని మండల వైద్యాధికారి డాక్టర్ శ్వేత అన్నారు.శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్బంగా శ్వేత మాట్లాడుతూ ప్రతి గర్భిణీ పుష్టికరమైనతీసుకొని డాక్టర్ల సలహాలు తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రి లోనే ప్రసూతి కావాలన్నారు. పౌష్టికాహర దాతలు చైత్ర ఫౌండేషన్ ఛైర్మెన్ యంగలి రామకృష్ణ గౌడ్ కూతురు యంగలి చైత్ర జన్మదినం సందర్బంగా గర్భణి మహిళలలకు, ఆరోగ్య కేంద్రం సిబ్బందికి అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమం లో డాక్టర్ పాల్వాయి వెంకటేష్,ఎం ఎన్ హెచ్ సీ శ్వేత,పి హెచ్ ఎన్ రాములమ్మ,సూపర్ వైజర్లు దయామణి.లయన్ క్లబ్ అధ్యక్షులు డెంకల సత్యనారాయణ, క్లబ్ ప్రతినిధులు దునక వెంకన్న, గుండ్ల రామ్మూర్తి,కప్పల శ్రీకాంత్, కర్నాటి శివశంకర్,ఏ ఎన్ ఎం లు ఆశా వర్కర్లు మనిమద్దే, గురజాల గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.