Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Manish Sisodia: ఆప్ మనీష్ సిసోడియాకు ఊరట

— బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు
–17 నెలలుగా జైల్లోనే ఉన్న ఆయ నకు ఎట్టకేలకు ఉపశమనం

Manish Sisodia: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi liquor scam case)అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియాకు (Manish Sisodia) ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గతేడాది ఫిబ్రవరి 26న ఈ కేసులో అరెస్ట్ అయ్యారు సిసోడియా (Manish Sisodia) అప్ప టి నుంచి బెయిల్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. దాదాపు 17 నెలలుగా ఆయన జైల్లోనే ఉన్న ఆయనకు మొత్తానికి ఉపశమనం దొరికింది. సీబీఐ సహా ఈడీ కేసులో నూ బెయిల్ ఇచ్చింది. దేశం విడిచి ఎక్కడికీ వెళ్లకూడదని షరతు విధిం చింది సుప్రీంకోర్టు.జస్టిస్ బీఆర్ గవా య్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూ రు చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీడ్ ట్రయల్ కు ఆయనకు హక్కు ఉందని తేల్చి చెప్పింది. “దాదాపు 17 నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు.

స్పీడీ ట్రయల్కి (Speedy trial) వెళ్లే హక్కు ఆయనకు ఉంది. ట్రయల్ కోర్టు, హైకోర్టు ఆయనకు ఈ హక్కు కల్పించా ల్సింది” అని జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు.బెయిల్ ఇస్తూ కోర్టు కొన్ని కండీషన్స్ పెట్టిం ది. సాక్ష్యులను ప్రభావితం చేయడా నికి ప్రయత్నించకూడది తేల్చి చె ప్పింది. పాస్ పోర్ట్ సరెండర్ చేయా లని ఆదేశించింది. అంతకు ముందు ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టు సిసోడియాకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఆయన వాదనను పట్టించుకోవాల్సింది అని వ్యాఖ్యానించింది. ఇప్పటికే ఆప్ నేత సంజయ్ సింగ్ కు ఇదే కేసులో బెయిల్ లభించింది. ఆ తరవాత సిసోడియాకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చినప్పటికీ అది కేవలం ఈడీ కేసులో పరిమితమైంది. సీబీఐ కేసులో మాత్రం ఆయన ఇంకా కస్టడీలోనే ఉన్నారు.

కవితకు (kavitha) వచ్చేవారం బెయిల్..? ఎమ్మెల్సీ కవిత (kavitha) కు నెక్స్ట్ వీక్ బెయిల్‌ వస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ చిట్ చాట్ లో తెలిపారు. కవిత కు (kavitha) హెల్త్ సిక్ అయ్యిందని అన్నారు. కవిత ఇప్పటి వరకు పదకొండు కేజీ ల బరువు తగ్గిందని అన్నారు. కవిత బెయిల్ ప్రాసెస్ జరుగుతుందని, నెక్స్ట్ వీక్ బెయిల్ వస్తుందన్నారు. ఇప్ప‌టికే ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీశ్ సిసోడి యాకు బెయిల్ వ‌చ్చిన నేప‌థ్యంలో ఆయ‌న నేడు మీడియాతో చిట్ ఛాట్ గా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యా లు చేశారు. కాగా, కవితకు బీజేపీ బెయిల్‌ ఇప్పిస్తుందనే కథనాలపై కేటీఆర్‌ (ktr)ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితకు బీజేపీ ఎందుకు బెయిల్ ఇప్పిస్తుందని మండిపడ్డారు. ఇలాం టి వార్తలు రాసిన వారిపై లీగల్ నోటీసు పంపిస్తామన్నారు. బేస్ లెస్ వార్తలు వేస్తున్నారని మండిప్డడా రు. యూ ట్యూబ్ లో కూడా రాకుం డా సస్పెండ్ చేయిస్తామన్నారు.