MD Salim: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వ విద్యను బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నిధులు కేటాయించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కేశరాజు పల్లి, డైట్ పాఠశాల, దేవరకొండ రోడ్డు బాలుర, రాష్ట్రపతి రోడ్డు బాలికల, బొట్టుగూడ, జేబిఎస్, మాల్ బౌలి పాఠశాలలను సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన తర్వాత పథకాల పేరు మార్చి నిర్మాణంలో ఉన్న డైనింగ్ హాల్స్ వంటశాలలు ఇతర మౌలిక సదుపాయాలు మద్యంతరంగా ఆగిపోయినాయని అన్నారు.
గత ప్రభుత్వం మన ఊరు మనబడి పథకం ద్వారా కేశరాజు పల్లి పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణం ప్రారంభించి మద్యంతరంగా ఆపివేయడం జరిగిందని అన్నారు. డైట్ పాఠశాలలో సుమారు 450 మంది విద్యార్థులు ఉండగా అటెండర్లు గాని జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఫ్యాకల్టీస్ ఎలాంటి బోధ నేతర సిబ్బంది లేకపోవడం ద్వారా విద్యార్థులకు సరైన సౌకర్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డైనింగ్ హాల్ సైకిల్ షెడ్ నిర్మాణం చేయాలని దేవరకొండ రోడ్డు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ తెలుగు పండిట్ ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్నాయని తక్షణం అక్కడ డిప్యూటేషన్ పద్ధతి ద్వారానైనా నియమించాలని కోరారు అకాడమిక్ సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలో కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వివరించాయని అన్నారు దేవరకొండోడు బాలల పాఠశాలకి అదునంగా నాలుగు తరగతి గదులు నిర్మించాలని ఉన్నత పాఠశాలకుల ప్రధానమైనటువంటి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు ఖాళీ పోస్టు ఉండడం దురదృష్టకరమని వెంటనే గెజిటెడ్ ఉపాధ్యాయుని నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి రోడ్డు బాలికల పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ఉన్నప్పటికీ ఎలాంటి పరికరాలు లేవని అన్నారు.
ఉన్నత పాఠశాలల స్థాయిలో కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఫ్యాకల్టీలు నియమించాలని నైట్ వాచ్మెన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పేద మధ్యతరగతి విద్యార్థులు వస్తున్న ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం ప్రత్యేకంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు వారానికి మూడు కోడిగుడ్లు అందిస్తున్నారని మధ్యాహ్న భోజనం కార్మికులకు బిల్లులు పెండింగ్ ఉన్నాయని వారికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల సంఖ్య పెంచడం కోసం విద్యార్థులకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్య క్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ కోట్ల అశో క్ రెడ్డి గుండాల నరేష్ మాజీ కౌ న్సిలర్ అవుట రవీందర్ తదితరు లు పాల్గొన్నారు