Media Academy Chairman K. Srinivas Reddy: మారుతోన్న సాంకేతికతకు అనుగు ణంగా జర్నలిస్టులు అప్డేట్ కావాలి
–మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి
Media Academy Chairman K. Srinivas Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: మారు తున్న సాంకేతికతకు అనుగుణంగా తమని తాము అప్డేట్ చేసుకుంటూ తమ వృత్తిలో రాణించేందుకు పా త్రికేయులకు ఇలాంటి శిక్షణ తరగ తులు ఎంతగానో ఉపయోగపడ తాయని మీడియా అకాడమీ చైర్మ న్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళ వారం నాంపల్లి లోని మీడియా అ కాడమీలో నిర్వహిస్తున్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పాత్రికేయుల శిక్ష ణ తరగతుల ముగింపు కార్యక్రమం లో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, మీడియా అకాడమీ సెక్రటరీ వెంక టేశ్వరరావు లతో కలిసి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హాజ రైనారు. ఈ సందర్భంగా చైర్మన్ మా ట్లాడుతూ సామాజిక బాధ్యత విలు వలతో కూడిన వృత్తి జర్నలిజమని నిజాయితీ పారదర్శకతతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జర్నలి స్టులు విధులు నిర్వహించాలని అన్నారు. నూతన టెక్నాలజీని విని యోగించుకుని పాఠకులను ఆకర్షిం చే విధంగా వార్తలను సేకరించాలని అన్నారు. పత్రికా రంగంలో వచ్చిన నూతన చట్టాలపై చైర్మన్ పాత్రికే యులకు అవగాహన కల్పించారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడు తూ ఇలాంటి శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకొని తమ వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందిం చుకొని సమాజం పట్ల తమ వంతు బాధ్యతను పాత్రికేయులు నిర్వర్తిం చాలని అన్నారు. మేడ్చల్ మల్కా జ్ గిరి జిల్లా అభివృద్ధి పురోగతిపై అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రస్తుతము 70శాతం జిహెచ్ ఎంసి పరిధిలోకి మారడం జరిగిం దని అన్నారు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ళు, ధాన్యం కొనుగోలు మూడు నెలలకు సరిపడా సన్న బియ్యం పంపిణీ వంటి ప్రభుత్వ పథకాలు కొనసాగుతున్నాయని పథకాల పురోగతిపై వివరణ ఇచ్చారు. అనంతరం అదనపు కలెక్టర్ పాత్రి కేయులు అడిగిన ప్రశ్నలకు సమా ధానాలు ఇచ్చారు. ఈ శిక్షణ కార్య క్రమానికి హాజరైన జర్నలిస్టులకు చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సర్టిఫికెట్లు అం దజేశారు. శిక్షణ తరగతులకు తెలం గాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు సమన్వయ కర్తగా వ్యవహారించిన ఈ కార్యక్ర మంలో సీనియర్ జర్నలిస్టులు శిక్ష ణ తరగతులను బోధించారు. కా ర్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకట్ రామ్ రెడ్డి, జిల్లా లోని సీనియర్ జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.