‘Media’ propaganda with baseless facts నిరాధారాలతో ‘ మీడియా’ దుస్ప్రచారo
- మా ప్రతిష్టను దిగజార్చేందుకు ఓ నేత కుట్రలు, కుయుక్తులు -- అవాస్తవ పుకార్లను తీవ్రంగా ఖండిస్తున్నాం -- ప్రజలే మా పిల్లలుగా ప్రజా జీవితంలో పని చేస్తున్నాము -- మా సంపద, మా జీవితo కాంగ్రెస్ పార్టీ, ప్రజల కోసమే -- మీడియా లో పరువు నష్టం కలిగించే కథనాలను ప్రచురించడం వేదన కలిగిoచింది -- ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
నిరాధారాలతో ‘ మీడియా’ దుస్ప్రచారo
–– మా ప్రతిష్టను దిగజార్చేందుకు ఓ నేత కుట్రలు, కుయుక్తులు
— ఉద్దేశపూర్వక అవాస్తవ పుకార్లను తీవ్రంగా ఖండిస్తున్నాం
— ప్రజలే మా పిల్లలుగా ప్రజా జీవితంలో పని చేస్తున్నాము
— మా సంపద, మా జీవితo కాంగ్రెస్ పార్టీ, ప్రజల కోసమే
— మీడియా లో పరువు నష్టం కలిగించే కథనాలను ప్రచురించడం వేదన కలిగిoచింది
— ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
ప్రజా దీవెన/ హైదరాబాద్: తాము కాంగ్రెస్ పార్టీని వీడి BRS పార్టీలో చేరుతున్నట్లు మీడియా (media), సోషల్ మీడియా (social media) లో వస్తున్న వార్తలు, కథనాలు పూర్తిగా అవాస్తవమని, ఎలాంటి ఆధారం లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kumar reddy), మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి (padmavathi Reddy) తీవ్రంగా ఖండిoచారు. శనివారం వారు ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్న ఓ నాయకుడు పార్టీలో నా స్థానాన్ని దిగజార్చేందుకు, ప్రజల్లో నా ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలాంటి దుష్ప్రచారం (misinformation) చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు .సోషల్ మీడియా/మీడియాలో వస్తున్న ఈ పుకార్లను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.
1994 తర్వాత ఎన్నికల్లో ఓడిపోకుండా, 30 ఏళ్లు నిరంతరంగా కాంగ్రెస్ పార్టీ (congress)విధేయతతో పనిచేసి, వరుసగా 6 ఎన్నికల్లో గెలుపొందినందుకు నేను, నా భార్య శ్రీమతి పద్మావతి రెడ్డి కోదాడ నుంచి ఎమ్మెల్యేగా ఉండి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం వంద ఓట్ల తేడాతో ఓడిపోయారని గుర్తు చేశారు.
కోదాడలో ఉంటూ పీసీసీ ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ తరపున తన శక్తి మేరకు అక్కడి ప్రజల (public)పనిచేస్తున్నారని, మాకు పిల్లలు లేరు, మేము ప్రజలే మా కుటుంబంగా మా పిల్లలుగా భావిస్తూ నిబద్ధతతో కూడిన ప్రజా జీవితంలో నిరంతరం పని చేస్తున్నామన్నారు. మేము గత 2 సంవత్సరాలుగా మాపై పూర్తిగా తప్పుడు మరియు పరువు నష్టం(defamation) కలిగించే కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీలో అనుచరులను అణగదొక్కడానికి, తొలగించడమే లక్ష్యంగా కూడా ఈ ప్రచారం జరుగుతుందని తెలిపారు. నేను పార్టీలో కొన్ని సమస్యలు, పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు, కానీ జాతీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి ( For internal democracy) సంబంధించిన విధి విధానాలను అనుసరిస్తానని స్పష్టం చేశారు.
ఖరాఖండిగా చెప్పాలంటే, నేను 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో, రాజ్భవన్(rajbhavana)స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యపై పి చిదంబరం అధికారిక సర్వ సభ్య సమావేశంలో తప్ప ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ (kcr ) ను కలవలేదని, మాట్లాడలేదని గుర్తు చేశారు.
నాకు ఎలాంటి వ్యాపారం, కాంట్రాక్టులు, భూమి లావాదేవీలు లేవని, నా ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణలో పని చేసినందుకు గర్వపదుతున్నానని (I am proud)చెప్పారు. మేము మా జీవితంలో మా సంపద, మా ఆరోగ్యం, మా కుటుంబ జీవితం మా జీవితంలోని ప్రతి దాన్ని కాంగ్రెస్ పార్టీ సేవ తో పాటు సాధారణ ప్రజల కోసం అందించామని, అందిస్తామని పేర్కొన్నారు.
నాకు ఏ ప్రభుత్వంతోనూ వ్యాపారం, ఒప్పందాలు, భూ ఒప్పందాలు లేవని మరోసారి పునరుద్ఘాటిస్తున్నానని వెల్లడించారు. ఒక నాయకుడితో సన్నిహితంగా ఉన్న యూ ట్యూబ్ ఛానెల్( YouTube), మీడియా(midia) సంస్థలు నా గురించి, నా సతీమణి గురించి తప్పుడు, పరువు నష్టం కలిగించే కథనాలను ప్రచురించడం మాకు తీవ్ర బాధను, వేదనను కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారనే నిరాధారమైన, తప్పుడు కథనాలను( False stories) తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.