Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MEO Salim Sharif : పది పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: MEO సలీం షరీఫ్

MEO Salim Sharif : ప్రజా దీవెన,కోదాడ: పట్టణంలో పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఏర్పాటుచేసిన 11 పరీక్ష కేంద్రాల్లో పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు మండల విద్యాధికారి సలీం షరీఫ్ తెలిపారు. కోదాడ అనంతగిరి మండలాలకు చెందిన 18 ప్రభుత్వ పాఠశాలలు 27 ప్రైవేట్ పాఠశాలలు మొత్తం 45 పాఠశాలలకు చెందిన 2084 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. కాగా ఇందులోఈ 1286 మంది బాలురు 798 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు గాను 132 మంది ఇన్విజిలేటర్లను 44 మంది చీఫ్, డిపార్ట్మెంటల్ ఆఫీర్లను అధికారులు నియామకం చేశారని తెలిపారు.

 

పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్ సౌకర్యం, బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్య సంరక్షణకు ఒక ఏఎన్ఎం పరీక్షా కేంద్రంలో హెల్త్ కిట్టుతో సేవలందించనున్నట్టు తెలిపారు. పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఇతరులను అనుమతించకుండా 144 సెక్షన్ ను పోలీసు శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. కోదాడ పట్టణంలోని కోదాడ టాలెంట్ స్కూల్ (కె టి ఎస్) యొక్క అడ్రస్ భవాని నగర్ గా హాల్ టికెట్లో తప్పుగా ముద్రణ అయిందని, కోదాడ టాలెంట్ స్కూల్ (కే టి ఎస్) పాఠశాల విజయవాడ రోడ్డులో ఉంటుందని సంబంధిత విద్యార్థులు గమనించాలన్నారు. పరీక్ష ఉదయం 9:30 నుండి 12.30 గంటల వరకు నిర్వహించబడుతుందని ఈ సమయంలో పట్టణంలో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని కోరారు. ఎటువంటి ప్రశ్న పత్ర లీకులకు ఆస్కారం లేకుండా ప్రశ్న పత్రం పైన క్యూఆర్ కోడ్ను అమలుపరుస్తున్నారని, ప్రశ్న పత్రాలను సీసీ కెమెరా నిఘా నీడలో తీయడము మరియు క్లోజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు.