–రూ.50 వేల కోట్ల దోపిడీకి పక్కా ప్రణాళిక
–కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
Minister Bandi Sanjay : ప్రజా దీవెన, పెద్దపల్లి: ఎల్ఆర్ఎస్ పేరుతో రేవంత్ సర్కార్ కొత్త దుకా ణం పెట్టిందని, రూ.50 వేల కోట్ల దోపిడీకి ప్లాన్ చేస్తోందని కేంద్రమం త్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్య లు చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గా లు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయని ఇచ్చిన హామీ లు నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టి ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయ లేకపోయారని విమర్శించారు. ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొ న్నారు. అనంతరం మీడి యాతో మాట్లాడారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేక తను ఎదుర్కొంటున్న అధికార కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గా లతో పాటు నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాలని పిలుపుని చ్చారు. హస్తంపార్టీకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కరువయ్యారని ఎద్దేవా చేశారు.
దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువు అవ్వడం కేవలం తెలంగాణలోనే చూస్తున్నా మని సెటైర్లు వేశారు. ఇక బీఆర్ ఎస్ పార్టీ భయంతో పోటీ నుంచి తప్పుకుందని దుయ్యబట్టారు. ఎ మ్మెల్సీ ఎన్ని కల్లో అన్ని వర్గాలు బీజేపీవైపే ఉన్నాయని, మొదటి ప్రాధాన్యతా ఓట్ల తోనే 3 ఎమ్మెల్సీ స్థానాలను గెలుస్తామని జోస్యం చెప్పారు. కులగణన విషయంలో కాంగ్రెస్ కొరివితో తలగొక్కుందని కామెంట్ చేశారు. ముస్లింలను తీ సుకొచ్చి బీసీల్లో కలిపారని, వారిని బీసీ కేటగిరి నుంచి తొలగించి 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డి మాండ్ చేశారు. ముస్లింలను తొల గిస్తేనే రిజర్వేషన్ల ఆమోదానికి ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశా రు. కేంద్ర ప్రభుత్వం తెలంగా ణకు ఎంతో ఇచ్చిందని నిధుల విష యం లో ఎక్కడైనా చర్చకు సిద్దమని బండి సంజయ్ సవాల్ విసిరారు.