Minister Duddilla Sridhar Babu : ప్రజా దీవెన, హైదరాబాద్ : హైద రాబాద్ లో 2030 నాటికి 200 మి లియన్ చదరపు అడు గుల “గ్రేడ్ ఏ” కమర్షియల్ స్పేస్ ను అందు బాటులోకి తేవాలని లక్ష్యంగా పె ట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం నానక్ రాంగూడలో యూఎస్ కు చెందిన సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్ని జెంట్ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన “సిటిజెన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్” ను ఆ యన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ హైదరాబాద్ “గ్లోబల్ బిజి నెస్ హబ్” గా మారిందని, అందు కు అనుగుణంగానే కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ పెరిగిందన్నారు. ఢిల్లీ, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ తగ్గుతుంటే మన దగ్గర గతేడాది దేశంలోనే అత్యధికంగా 56 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదయ్యింద న్నారు.
గతేడాది రిటైల్ రంగంలో 1.8 మిలి యన్ చదరపు అడుగుల స్పేస్ ను వివిధ సంస్థలు లీజుకు తీసుకు న్నాయన్నారు. హైదరాబాద్ లో ఆమ్జెన్, గ్లోబల్ లాజిక్, ఎలీ లిల్లీ, మారియంట్, సిగ్నా లాంటి అం తర్జాతీయ సంస్థలకు చెందిన 355 జీసీసీలుండగా 3 లక్షల మందికి ఉ ద్యోగాలు కల్పిస్తున్నాయన్నారు.
ఏడాది వ్యవధిలో 70 కి పైగా కొత్త జీసీసీలు హైదరాబాద్ లో ప్రారంభ మయ్యాయన్నారు. హైదరాబాద్ ను జీసీసీలకు హబ్ గా మార్చడమే కాకుండా వాటిని ఇన్నోవేషన్, ఆర్ అండ్ డీ, ప్రొడక్ట్ డెవలప్మెంట్ తది తర అంశాల్లో సేవలు అందించే గ్లో బల్ వాల్యూ యాడెడ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టు కు న్నామన్నారు. 2030 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా ట్రిలి యన్ డాలర్లకు చేరుతుందన్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసు కొ చ్చి యువతకు ఉద్యోగాలు కల్పిం చడమే తమ లక్ష్యమని వివరించా రు. కొందరు కావాలనే పనిగట్టుకొని పెట్టుబడులు రాకుండా దుష్ప్రచా రం చేస్తున్నారని మండిపడ్డారు. అ యినా సీఎం రేవంత్ రెడ్డి నేతృ త్వంలోని ప్రజా ప్రభుత్వంపై న మ్మకంతో ఎంతో మంది పారి శ్రా మికవేత్తలు పరిశ్రమలు స్థాపిం చేం దుకు ముందుకు వస్తున్నారని, వా రికి అన్ని రకాలుగా అండగా ఉం టామన్నారు.
తమ జీసీసీని హైద రాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ముందుకొ చ్చిన సిటిజెన్స్ ఫైనాన్షి యల్ గ్రూ ప్, కాగ్నిజెంట్ టెక్నాల జీస్ నిర్వా హకులకు ఆయన కృత జ్ఞతలు తె లిపారు. ప్రస్తుతం వేయి మంది ఐ టీ, డేటా నిపుణులకు ఇక్కడ ఉ పాధి అవకాశాలు లభిస్తాయని… రెండు, మూడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, సిటిజన్స్ ఫై నా న్షియల్ గ్రూప్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆ ఫీసర్, హెడ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ టె క్నాలజీ, సెక్యూరిటీ మైకెల్, కా గ్ని జెంట్ ప్రెసిడెంట్ – అమెరికా సూ ర్య గుమ్మాడి తదితరులు పాల్గొ న్నారు.