Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komati Reddy Venkata Reddy + జిల్లా ప్రజలకు ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆశీస్సులు

–రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Minister Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన కనగల్: ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆశీస్సు లు జిల్లా ప్రజలపై ఎల్లప్పుడూ ఉం డాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సి నిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ప్రార్థించారు. శనివా రం ఆయన నల్గొండ జిల్లా, కనగల్ మండలం, ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి పుట్ట మండపా న్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

నల్గొండ జిల్లా ప్రజలు ఎల్లప్పుడు సుఖః శాంతులతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ,ప్రజలు అమ్మవారి ఆశీ స్సులు, దీవెనలు పొంది ఆరోగ్యం గా జీవించాలని ఆకాంక్షించారు. అమ్మవారి దేవాలయ అభివృద్ధి తో పాటు, ధర్వేశిపురం, కనగల్లు అభి వృద్ధికి తాను ఎల్లప్పుడూ ముందు ఉంటానని అన్నారు. ధర్వేశిపురం లో ప్రత్యేకించి సిసి రో డ్ల నిర్మాణం, సెంట్రల్ డివైడర్, సెం ట్రల్ లైటింగ్ , ఎల్ఈడీ లైట్లు ఏర్పా టు చేసినట్లు తెలిపారు. ధర్వేశిపు రం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు నల్గొం డ తో పాటు, చుట్టు పక్కల జిల్లాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో వస్తు న్నారని , భక్తులకు ఎలాంటి అసౌక ర్యం కలగకుండా దశలవారిగా దేవా లయాన్ని అభివృద్ధి చేస్తామని మం త్రి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ చీదేటి వెంకట రెడ్డి, మాజీ జడ్పిటిసి నర్సింగ్ శ్రీని వాస్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుప రెడ్డి, పలు వురు మాజీ ప్రజా ప్రతినిధులు, కాం గ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.