Minister Komati Reddy Venkata Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో రాష్ట్ర రోడ్లు భవనా ల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి శనివారం సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం ఎన్జీ కళాశాలలో మంత్రి కోమటిరెడ్డి వాకింగ్ తో ప్రా రంభమైన పర్యటన పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సుడిగాలిలా కొన సాగింది. రామాలయం వద్ద రోడ్డు పక్కన ఇడ్లీ బండి వద్ద అల్పా హా రం చేయడం ద్వారా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
శేషమ్మ గూడెంలో ఎస్టిపి ప్లాం ట్ సందర్శన…. నల్లగొండ పానగ ల్ ఛాయా సోమే శ్వరాలయం నుం చి వెనుక భాగంలో నూతన రోడ్డు, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు.
అంతకుముందు నల్గొండ పర్యట నలో ఉన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం ఉదయం 6 గంటల నుంచి గుడ్ మార్నింగ్ నల్ల గొండ అంటూ నల్లగొండ పట్టణం లో విస్తృతంగా పర్యటించారు.
చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రజల తో కరచాలనం చేస్తూ ముందుకు కదులుతున్న మంత్రి రామాలయం కాలనీలో సువర్ణ అనే మహిళ నిర్వ హిస్తున్న టీఫిన్ బండీ దగ్గర ఆగి ఇ డ్లీ అల్పాహారం చేసి సువర్ణకు ఇం దిరమ్మ ఇండ్ల పథకంలో ఇళ్లు మం జూరీ చేస్తానని హామి ఇచ్చారు.
అదే విధంగా తనకున్న చిన్నపాటి భూమిని అధికారులు కిరికిరి పెడు తున్నారని సువర్ణ మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసు కు రాగానే వెంటనే ఎమ్మార్వోను వచ్చి సువర్ణ భూసమస్యను పరిష్కరిం చాలని సిబ్బందిని ఆదేశించారు.
అంతకు ముందు ఎన్.జీ.కాలేజీ కంపౌండ్ వాల్ పక్కన స్థానికలు చెత్తవేయడం వల్ల డ్రైనేజీ మొత్తం నిండిపోయి పరిసరాలు చెత్తమ యంగా ఉండటంపై మంత్రి సీరియ స్ అయ్యారు. వెంటనే డ్రైనేజీ పై వాల్స్ నిర్మించి చెత్తనిండకుండా చూడాలని మున్సిపాలిటీ అధికా రులను ఆదేశించారు.
అనంతరం లెప్రసీ కాలనీలో డ్రైనేజీ క్లీన్ చేసే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో కొత్త మిషనరీ ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. పానగల్ ఛాయ సోమేశ్వరలయం వెనక భా గం వద్ద నూతనంగా రోడ్డు ఏర్పా టు చేయడం, పార్కింగ్ స్థల పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ నెలలోపు ఎస్టిపి ని పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. నల్గొం డ పట్టణంలో సుమారు 80 శాతం ఇండ్లు 20 ఏళ్ల కింద సీవరేజ్ ట్రీ ట్మెంట్ అనుసంధానించ బడ్డా య ని తెలిపారు. 2014లో 38 కోట్లతో ఎస్టిపి మంజూరైనప్పటికీ నేటికీ పూ ర్తి కాకపోవడం బాధా కరమన్నారు.
వెంకటేశ్వర కాలనీ ,రాఘవేంద్ర కాల నీ అన్నింటికీ ఎస్టిపి కనెక్షన్లు ఉన్నాయని, రానున్న 25 ,30 రోజు ల్లో ఎస్టీపీని పూర్తి చేయమని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారు లను, పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తితో పాటు, చుట్టూ గా ర్డెన్ ఏర్పాటు చేయాలని, తక్కిన 30 శాతం ఇండ్లకు కూడా ఎస్ టి పి కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. నర్స ప్ప గూడ వద్ద అధునాతన సాం కే తిక పరిజ్ఞానంతో మరో ఎస్టిపి నిర్మా ణం చేస్తానని చెప్పారు. ఇందుకు ప్రజలు సహకరించాలి, ప్రజలు ఇ బ్బందులు పడే పని ఎప్పటికీ చే యమని స్పష్టం చేశారు.జిల్లా కలెక్ట ర్ తో పాటు ప్రత్యేక అధికారి స్పెష ల్ ఇంట్రెస్ట్ తో ఎస్టిపి నిర్మాణాన్ని పూర్తి చేయించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదన పు కలెక్టర్ శ్రీనివాస్, మాజీ ము న్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,పబ్లిక్ హెల్త్ సూపరింటెండెం ట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, ఆర్డీవో అశోక్ రెడ్డి, మున్సిప ల్ కమిషనర్ సయ్యద్ ముసాబు అహ్మద్ ఉన్నారు.