Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komatireddy Venkat Reddy : కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్య, కమిష న్లకు కక్కుర్తిపడి ఔటర్ అమ్మేశారు

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: పదేళ్ల బీఆర్ఎస్ పాల నలో హైదరాబాద్ అభివృద్ధి శూ న్యమని, అంతా కాంగ్రెస్ హయాం లోనే జరిగిందని అన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి ఔటర్ రింగ్ రోడ్డు టెండర్‌ను రూ.7, 300 కోట్లకు ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టారని రోడ్లు భవనాలు, సినిమా టోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారు లకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తెలి పారు. శుక్రవారం ఆయన ఈ మేర కు శాసనసభలో మాట్లాడారు. కాంట్రాక్టర్లకు ఇవ్వా ల్సిన 40 శా తం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంద ని చెప్పారు. వారికి ఆరు నెలలు లేదా మూడు నెలలకు చెల్లి స్తా మన్నారు. ప్రతి గ్రామం నుంచి మం డలానికి డబుల్ రోడ్లు వేయి స్తామ ని తెలిపారు. బీఆర్ఎస్‌ హ యాం లో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ ల‌కు రోడ్లు వేశారని చెప్పారు. ఆ మూ డు చోట్ల రోడ్లకు చివరికి సింగ రేణి నిధులు కూడా వాడారని పేర్కొ న్నారు.గతంలో మద్యం దుకాణాల గడువుకు 3 నెలల ముందే దర ఖాస్తులు తీసుకున్నారని దుయ్య బట్టారు. నిరుద్యోగుల వద్ద నాన్ రిఫండబుల్ ఫండ్ కింద రూ.2 వేల కోట్లు వేసూలు చేసిన విషయం వా స్తవం కాదా అని ప్రశ్నించారు. భూ ములు గురించి హరీశ్ రావు మా ట్లాడటం హస్యాస్పదంగా ఉందని అన్నారు. కోకాపేట భూములు వే లం వేసిన చరిత్ర ఎవరిదని మం డిపడ్డారు. హరీశ్‌రావును ముందు పెట్టి మాట్లాడిస్తున్నారని. ఆయన వెనుక మరో ముగ్గురు వ్యక్తులు ఉ న్నారంటూ మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.