— మంత్రి కోమటిరెడ్డి
Minister Komati Reddy Venkata Reddy :ప్రజాదీవెన నల్గొండ : త్యాగాలకు ప్రతీక అయిన ఈద్ ఉల్ అదా సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ముస్లింల త్యాగనిరతిని చాటే బక్రీద్ పండుగను భక్తి ప్రవత్తులతో జరుపుకోవాలని కోరారు.త్యాగం, అంకితభావాల జ్ఞాపకాలను మేలుకొలిపే మరో త్యాగం ఈ పండుగని మంత్రి పేర్కొన్నారు. ఈ పవిత్ర సందర్భంలో అల్లా మీ త్యాగాలను గుర్తించి కోరికలు నెరవేర్చాలని ఆకాంక్షించారు.
ముస్లింల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వారి అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. త్యాగానికి ప్రతీక అయిన పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలంతా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.